బీఆర్ఎస్‌కు దూరం – బలంగా ఉన్న అన్ని చోట్ల మజ్లిస్ పోటీ !

తెలంగాణ రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు వస్తున్నాయి. చేరికల విషయంలో కాంగ్రెస్ పార్టీ దూకుడు మీద ఉంటే.. అవసరం లేని స్నేహం చూపించుకుంటూ బీఆర్ఎస్, బీజేపీ డిఫెన్సివ్ మోడ్ లోకి వెళ్లిపోయాయి. తాజాగా మజ్లిస్ కూడా తాము బీఆర్ఎస్‌తో కలిసి లేమని చెబుతోంది. తెలంగాణలో తాము బలంగా ఉన్న అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తామని అసదుద్దీన్ ఓవైపీ నిజామాబాద్‌లో ప్రకటించారు. బోధన్ లో ఖచ్చితంగా పోటీ చేస్తామన్నారు.

బోధన్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై దాడి చేశారంటూ ఇటీవల కొంత మంది మజ్లిస్ నేతలపై కేసులు పెట్టి జైల్లో వేశారు. వారిని పరామర్శించేందుకు వచ్చిన అసదుద్దీన్ బీఆర్ఎస్ పైనా మండిపడ్డారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. ముందు మా క్రికెట్ బ్యాటింగ్ మేము ఆడతాము.. మా స్కోర్ మేము చూసుకుంటాం.. ఆపై ఎవరిని అవుట్ చేయాలి అనేది ఆలోచిస్తామని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. అంటే… ముందు సంఖ్యాబలం పెంచుకుంటే.. తర్వాత వచ్చే ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించవచ్చని మజ్లిస్ చీఫ్ అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.

వచ్చే ఎన్నికలు తెలంగాణలో అత్యంత హోరాహోరీగా జరగబోతున్నాయి. ఏ పార్టీకి పూర్తి మెజార్టీ రాకపోవచ్చన్న అంచనాలు కూడా వస్తున్నాయి. ఈ పోటీలో తన ప్రభావం చూపాలని మజ్లిస్ చీఫ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. గత అసెంబ్లీ సమావేశాల్లో అక్బరుద్దీన్ , కేటీఆర్ మధ్య వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ తాము తెలంగాణలో యాభై స్థానాల్లో పోటీ చేస్తామనిప్రకటించారు. ఇప్పుడు అసదుద్దీన్ కూడా అదే తరహాలో ప్రకటనలుచేస్తూండటం ఆసక్తికరంగా మారింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close