బీసీ మంత్రుల్ని మాజీల్ని చేసేసి వారితోనే చైతన్యయాత్ర చేపిస్తారట !

వైఎస్ జగన్ కేబినెట్‌లో మంత్రులందరూ రాజీనామాలు చేయబోతున్నారు. వారిలో ఇటీవల పదవులు చేపట్టిన బీసీ నేతలు చెల్లు బోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు వంటి వారు కూడా ఉండనున్నారు. మొదటి నుంచి పదవిలో ఉన్న బీసీ నేతలుకూడా ఉన్నారు. అందరి పదవులు ఊడనున్నాయి. ఇది మైనస్ అవుతుందేమో అనుకుంటున్న వైసీపీ హైకమాండ్ వినూత్నమైన ఆలోచన చేసింది. మాజీలయ్యే బీసీ మంత్రులతోనే.. బీసీలకు జగన్ రెడ్డి సర్కార్ చాలా చేసిందని ఊరూరా చెప్పే ప్రణాళిక సిద్దం చేసింది.

బీసీ మంత్రులందర్నీ సజ్జల రామకృష్ణారెడ్డి పిలిపించుకున్నారు. పదవులు పోతున్నాయని నేరుగానే చెప్పేశారు. వారిలో చాలా మందికి పార్టీపదవులు కూడా ఇవ్వడం లేదని.. అయితే వాడుకోవడం లేదని అనుకోవద్దనిచెప్పి.. యాత్ర ప్రణాళిక వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ చైతన్య పర్యటనలు, సమావేశాలు నిర్వహించాలని రూట్ మ్యాప్ ఖరారు చేశారు. బీసీలకు సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీలు, జరిగిన మేళ్లను ప్రజలకు చెబుతామని మాజీలు కాబోయే ప్రస్తుత బీసీ మంత్రులు చెబుతున్నారు.

బీసీల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు కార్యక్రమాలు నిర్వహిస్తామని చెబుతున్నారు. తొలుత అన్ని కొత్త జిల్లాల్లో బీసీ ప్రాంతీయ సదస్సులు అనంతరం రాష్ట్ర స్థాయిలో బీసీ సదస్సు నిర్వహించనున్నారు. ఏప్రిల్ నెల 15 తర్వాత నెల పాటు పర్యటనలు చేయాలని నిర్ణయించారు. అప్పటికి వీరంతా మాజీలవుతారు. కొత్త బీసీ మంత్రులు వస్తారు. అప్పుడు వీరిని పట్టించుకునేవారు కూడా ఉండరు. అయినప్పటికీ వారికి అసంతృప్తి లేకుండా చేయాలని.. వారికి అన్యాయం చేశారన్న వాదన ప్రజల్లోకి వెళ్లకుండా.. వారితోనే జగన్‌కు పొగడ్తలు కురిపించాలని భారీ ప్రణాళిక సిద్ధం చేసేశారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ సారి అంబటి రాంబాబు అల్లుడు – ఇలా ఛీ కొడుతున్నారేంటి?

ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు కుటుంబసభ్యుల నుంచి పెద్ద షాక్ తగిలింది. ఆయన రెండో అల్లుడు అంబటిని ఛీత్కరించుకుంటూ వీడియో విడుదల చేశారు. ముద్రగడ పద్మనాభం కూతురు వరుసగా...

మాఫియాను అంతం చేసేందుకే కూటమి : అమిత్ షా

ఆంధ్రప్రదేశ్ భూ మాఫియాను అంతం చేసి అమరావతిని రాజధానిగా చేసేందుకు కూటమిగా ఏర్పడ్డమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ధర్మవరంలో ఎన్నికల ప్రచారసభకు హాజరయ్యారు. చంద్రబాబు కూడా అమిత్ షాతో...

విష ప్ర‌చారాన్ని తిప్పి కొట్టిన ‘గెట‌ప్’ శ్రీ‌ను!

'జ‌బ‌ర్‌ద‌స్త్' బ్యాచ్‌లో చాలామంది ఇప్పుడు పిఠాపురంలోనే ఉన్నారు. జ‌న‌సేనానికీ, కూట‌మికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేస్తున్నారు. జ‌బ‌ర్‌ద‌స్త్ బ్యాచ్ ఇలా స్వ‌చ్ఛందంగా ప్ర‌చారానికి దిగ‌డం.. వైకాపా వ‌ర్గానికి న‌చ్చ‌డం లేదు. దాంతో వాళ్ల‌పై ర‌క‌ర‌కాల...

ఏడు మండలాలు కాదు. ఐదు గ్రామాలే అంటున్న కాంగ్రెస్ !

కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోల ఐదు గ్రామాల ప్రస్తావన తీసుకు వచ్చింది. ఏపీలోని ఐదు గ్రామాలను తెలంగాణలో కలుపుతామని ప్రకటించింది. దీంతో కొత్త వివాదం ప్రారంభమయింది. ఇది ఓ రకంగా గట్టు తగాదా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close