కట్టు తెగిన తెలంగాణ బీజేపీ !

తెలంగాణ బీజేపీ ఇప్పుడల్లా కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. కిషన్ రెడ్డి కూడా ఎవర్న కంట్రోల్ చేసే అవకాశాలు కనిపించడం లేదు. కిషన్ రెడ్డి ప్రమాణస్వీకారంలో పార్టీపై పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బండి సంజయ్ లతో పాటు విజయశాంతి చేసిన వ్యాఖ్యలు పార్టీ తీరు మరింత దిగజారిపోబోతోందనడానికి సూచికల్లా కనిపిస్తున్నాయి.

పార్టీ కోసం అవిశ్రాంతంగా కష్టపడిన తనకు అన్యాయం జరిగిందని బండి సంజయ్ మనసులో ఉందని..తనపై కొంత మంది లేని పోని ఫిర్యాదులు చేశారని ఆయన మనసులో ఉంది. దీన్ని నేరుగా కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార వేడుక సందర్భంగా చేసిన ప్రసంగంలో వెల్లడించారు. ఇక రాజగోపాల్ రెడ్డి చేసిన హడావుడి వేరే లెవల్. ఆయన కవితను అరెస్ట్ చేయడానకి ఈడీ లంచాలు తీసుకోవడమే కారణమని కూడా ఆరోపించారు. ఇక ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన విజయశాంతి మధ్యలోనే వెళ్లిపోయారు. ఎవరూ పట్టించుకోకపోవడంతోనే ఆమె వెళ్లిపోయారన్న ప్రచారం జరిగింది.

కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి హాజరైన వారి మధ్య వివాదాలు ఏర్పడగా.. అసలు కార్యక్రమానికే రాని వాళ్లు ఉన్నారు. యెన్నం శ్రీనివాసరెడ్డి, జిట్టా బాలకృష్ణారెడ్డి, చంద్రశేఖర్ , ఏనుగు రవీందర్ రెడ్డి వంటి వారు హాజరు కాలేదు. వారంతా పార్టీ మారుతారన్న ప్రచారం జరుగుతోంది. రానివారు.. వచ్చిన వారి మధ్య అసంతృప్తిని తక్కువగా అంచనా వేయలేమని బీజేపీ వర్గాలంటున్నాయి. ముందు ముందు బీజేపీలో జరిగే పరిణామాలను అంచనా వేయడం కష్టమన్న వాదన వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

తిట్లు,విధ్వంసం, రౌడీయిజానికా పాజిటివ్ ఓటు సజ్జలా !?

పాజిటివ్ ఓటు వస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి పోలింగ్ అయిపోగానే గోళ్లు గిల్లుకుంటూ మీడియాకు చెప్పారు. వైసీపీకి మద్దతు పలికేందుకు అంత పరుగులు పెట్టి ఓటర్లు రావడానికి అవసరమయ్యే ఒక్క పాజిటివ్ కారణం...

ఏపీలో పోలింగ్ పర్సంటేజీ 82 ప్లస్!

ఆంధ్రప్రదేశ్‌లో ఓటరు చైతన్యం వెల్లి విరిసింది. కొత్త ఓటర్లతో పాటు యువత పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించడంతో పోలింగ్ ఊహించనంతగా పెరిగింది. గత ఎన్నికల్లో 79 శాతం ఈవీఎం ...

అప్పుడే ఓటమికి కారణాలు చెప్పేసిన మంత్రి..!?

సర్వేలన్నీ కూటమిదే అధికారమని తేల్చడం, పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ నేతలు అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. కారణం ప్రభుత్వ వ్యతిరేకత కాదని, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తున్నారు. సాధారణ...

ఏపీలో ముగిసిన పోలింగ్ …పోలింగ్ పెరగడంతో వైసీపీలో టెన్షన్..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాలో వైసీపీ , టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close