ఎమ్మెల్యేల గైర్హాజరీపైనే బీజేపీ ఆశలు..! బీజేపీ దగ్గర మూడు ప్లాన్లు..!!

కర్ణాటకలో భారతీయ జనతాపార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించడంతో అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. వందల కోట్లు వెచ్చించి ఎమ్మెల్యేలను కొంటున్నారని.. ప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తున్నారని.. రకరకాలుగా మాటల తూటాలు నేరుగా బీజేపీకి తగులుతున్నాయి. కానీ ఇంత దారుణమైన ఇమేజ్ తెచ్చుకోవడానికి బీజేపీ సిద్ధంగా లేదన్న ప్రచారం ఉంది. అందుకే బీజేపీ మూడు మార్గాలను రెడీ చేసి పెట్టుకుంది.

బీజేపీ దగ్గర పెట్టుకున్న మొదటి అస్త్రం… ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యేలా చూడటం. ప్రస్తుతం అసెంబ్లీలో 222 మంది ఎమ్మెల్యేలున్నారు. బీజేపీకి 104 మంది సభ్యులున్నారు. బీజేపీ ఎమ్మెల్యేల సంఖ్య మెజార్టీలోకి రావాలంటే.. అసెంబ్లీకి 207 మంది ఎమ్మెల్యేలు హాజరైతే చాలు. అంటే పదిహేను మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రాకుండా బీజేపీ చేయగలిగితే.. యడ్యూరప్ప ప్రభుత్వం గట్టెక్కుతుంది. ఎమ్మెల్యేలను… కొన్నారన్న విమర్శలు కొంత వరకు తగ్గుతాయి.

ఇది సాధ్యం కాకపోతే… వాజ్ పేయి తరహాలో… అసెంబ్లీలో గంభీరంగా ప్రసంగించి… పదవికి రాజీనామా చేయడం. గతంలో 1996లో వాజ్‌పేయి మొదటిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు ఎన్డీఏకు బలం లేదు. కానీ ఇతరులెవరూ ముందుకు రాకపోవడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. విశ్వాస తీర్మానంపై చర్చ పెట్టారు. అందులో గంభీరంగా మాట్లాడిన వాజ్‌పేయి తన ఉద్దేశాలను ప్రజలకు .. వివరించారు. ఆ తర్వాత ఓటింగ్ జరగకుండానే రాజీనామా చేశారు. దాంతో వాజ్ పేయికి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు యడ్యూరప్ప అదే చేయవచ్చు.

ఇక మూడో ప్లాన్ నేరుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడమే. ఇలా చేస్తే బీజేపీ తన పతనాన్ని తాను నేరుగా కొని తెచ్చుకున్నట్లే. ఎలా గెలిచామన్నది కాదు..గెలిచామా లేదా అన్నది ఎన్నికల వరకూ పనికొస్తుందేమో కానీ.. నేరుగా ప్రజాస్వామ్యంపై ప్రభావం చూపే ఇలాంటి విషయాల్లో మాత్రం బీజేపీకి ఇప్పటికప్పుడు కాకపోయినా భవిష్యత్‌లో అయినా సమస్యలే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఇంత మోసమా కొమ్మినేని ? వైసీపీ క్యాడర్‌ని బలి చేస్తారా ?

వైసీపీ క్యాడర్ ను ఆ పార్టీ నేతలు, చివరికి సాక్షిజర్నలిస్టులు కూడా ఘోరంగా మోసం చేస్తున్నారు. ఫేకుల్లో ఫేక్ .. ఎవరు చూసినా ఫేక్ అని నమ్మే ఓ గ్రాఫిక్...

భ‌ళా బెంగ‌ళూరు..ప్లే ఆఫ్‌లో చోటు

ఎనిమిది మ్యాచ్‌లు ఆడితే.. అందులో 7 ఓట‌ములు. పాయింట్ల ప‌ట్టిక‌లో చిట్ట చివ‌రి స్థానం. ఇలాంటి ద‌శ‌లో బెంగ‌ళూరు ప్లే ఆఫ్‌కి వెళ్తుంద‌ని ఎవ‌రైనా ఊహించి ఉంటారా? కానీ బెంగ‌ళూరు అద్భుతం...

రేవంత్‌తో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేల భేటీ

సీఎం రేవంత్ రెడ్డితో ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారు. ఈసీ పర్మిషన్ వస్తే మంత్రి వర్గ సమావేశం నిర్వహించాలనుకున్న రేవంత్ రెడ్డి సచివాలయంలోనే ఉన్నారు. అయితే హఠాత్తుగా ఆయనను...

టీమిండియా కోచ్ రేసులో గంభీర్ – అందుకే కోహ్లీ రిటైర్మెంట్ కామెంట్స్..?

టీమిండియా కోచ్ గా రాహుల్ ద్రవిడ్ కాంట్రాక్ట్ జూన్ నెలలో ముగుస్తుండటంతో తదుపరి ఎవరిని ఎంపిక చేస్తారన్న దానిపై ఆసక్తి నెలకొంది. ఇదివరకు రికీ పాంటింగ్, స్టీఫెన్ ఫ్లెమింగ్ తో పాటు పలువురు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close