ఢిల్లీ బీజేపీ గల్లీ రాజకీయం !

భారతీయ జనతా పార్టీ అంటే దేశంలోనే ఇప్పుడు అతి పెద్ద పార్టీ. రాష్ట్రాలకు రాష్ట్రాలు పరిపాలిస్తోంది. కానీ చేసే రాజకీయాలు మాత్రం గల్లీ స్థాయిలోనే ఉంటాయన్న విమర్శలను మాత్రం ఎప్పుడూ వదులుకోదు. తాజాగా ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల విషయంలో ఆ పార్టీ చేస్తున్న రాజకీయం దేశం మొత్తాన్ని ఔరా అనిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికలను నిలిపివేయడానికి ఏకంగా కేంద్ర కేబినెట్‌లో కీలకమైన నిర్ణయాన్ని హడావుడిగా తీసుకున్నారు. దీనిపై ఆమ్ ఆద్మీ సహజంగానే విరుచుకుపడుతోంది.

ఢిల్లీలో మూడు మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ మూడింటిలోనూ బీజేపీనే అధికారంలో ఉంది. అయితే వాటి కాలపరిమితి ముగిసింది. ఎన్నికలు పెట్టాల్సి ఉంది. ఢిల్లీ మున్సిపల్ ఎన్నికలను కూడా కేంద్ర ఎన్నికల సంఘమే నిర్వహిస్తుంది. గత వారం షెడ్యూల్ రిలీజ్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. కానీ హఠాత్తుగా కేంద్ర ప్రభుత్వం అధికారికంగా… తాము మున్సిపాలిటీలను విలీనం చేయాలనుకుంటున్నామని.. ఎన్నికలు నిర్వహించదని లేఖ రాసింది. దాంతో ఈసీ కూడా షెడ్యూల్ కూడా ఆపేసింది. తర్వాత మూడు మున్సిపల్ కార్పొరేషన్లను కలిపివేస్తూ ఒకదానిగా మారుస్తూ కేంద్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నారు.

బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని ఇప్పుడు పార్లమెంట్‌లో ఆమోదింప చేసుకుని ఆ తర్వాత .. దానికి తగ్గట్లుగా విలీన కార్యక్రమాలు పూర్తి చేసి అప్పుడు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికలను ఆలస్యం చేయడానికే ఇలా చేస్తున్నారని కేజ్రీవాల్ మండిపడుతున్నారు. సమయానికి ఢిల్లీలో ఎన్నికలు నిర్వహించి.. బీజేపీ గెలిస్తే ఆప్‌ను మూసేస్తానని ఆయన సవాల్ చేస్తున్నారు . దీనిపై బీజేపీ సైలెంట్‌గా ఉంది. ఢిల్లీ రాజకీయాలను.. ఢిల్లీ లోకల్‌గానే ఉంచకుండా.. ప్రతీ సారి కేంద్ర ప్రభుత్వం అధికారాలను వినియోగిస్తూండటంతో దేశవ్యాప్త చర్చనీయాంశం అవుతూనే ఉంది. గతంలో ఢిల్లీ ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అనే చట్టం కూడా చేసింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ ల్యాండ్ చుట్టూనే తిరుగుతున్న మల్లారెడ్డి

తనకు ఐదు వందల ఎకరాలు ఉన్నాయని తనకు ఎవరి భూమి కబ్జా చేయాల్సిన పనే లేదని మల్లారెడ్డి తరచూ చెబుతూంటారు. కానీ ఓ స్థలం విషయంలో మాత్రం ఆయన నేరుగా రంగంలోకి...

సీఎస్‌ను తప్పిస్తే మొత్తం సెట్ రైట్ – ఎందుకు మార్చరు ?

ఏపీలో జరుగుతున్న సర్వ అవకతవకలకు కారణం చీఫ్ సెక్రటరీ. జగన్ రెడ్డి జేబులో మనిషిగా వ్యవహరిస్తూ వ్యవస్థలన్నింటినీ భ్రష్టుప్టటిస్తున్నారు. చివరికి అల్లర్లపై విచారణ చేయడానికి సిట్ అధికారులుగా ఏసీబీ వాళ్లను..సీఐడీలో పని...

ఏబీవీపై అవే కుట్రలు – భస్మాసుర సివిల్ సర్వీస్ ఆఫీసర్లు !

మీరు ఏది చేస్తే మీకు అది తిరిగి వస్తుందని గీత చెబుతోంది. చాలా మంది అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయి.. తర్వాత అలాంటివే తమకు జరుగుతూంటే.. గగ్గోలు పెడుతూంటారు.కానీ ఎవరి సానుభూతి రాదు. చరిత్రలో...

మౌనంగా విజయసాయిరెడ్డి – ఆడిటింగ్‌లోఉన్నారా ?

జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు విదేశాలకు వెళ్లినా విజయసాయిరెడ్డి కూడా వెళతారు. అయితే జగన్ వెళ్లిన దేశానికి కాదు. వేరే దేశాలకు వెళ్తారు. ఈ లింక్ ఏమిటో తెలియదు కానీ.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close