హైదరాబాద్ డాక్టర్‌ల కాల్పుల ఘటనలో కొత్తకోణాలు

హైదరాబాద్: నగరంలోని హిమాయత్‌నగర్‌లో నిన్న సాయంత్రం జరిగిన కాల్పుల ఘటన క్రైమ్ థ్రిల్లర్ సినిమాల తరహాలో కొత్త మలుపులు తిరుగుతోంది. నిన్న సాయంత్రం హిమాయత్ నగర్ రోడ్ నంబర్ 6లో ఫోక్స్ వాగన్ కారులో ఈ కాల్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఆ కారులో శశి కుమార్, ఉదయ్, సాయికుమార్ అనే ముగ్గురు వైద్యులు ఉండగా, శశికుమార్ డ్రైవర్ సీటులో ఉన్న ఉదయ్‌పై కాల్పులు జరిపి పారిపోయారు. ఇది చూసి సాయి కుమార్ కారు దిగి భయంతో పరారయ్యారు. డాక్టర్ ఉదయ్‌కు బుల్లెట్ చెవిపక్కగా దూసుకుపోయింది. అతను ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ డాక్టర్లు మాదాపూర్‌లోని లారెల్ ఆసుపత్రిలో భాగస్వాములని, వ్యాపార లావాదేవీలే విభేదాలకు కారణమని తర్వాత బయటపడింది. అయితే కాల్పులు జరిపి పరారయిన డాక్టర్ శశికుమార్ ఇవాళ శివార్లలోని మొయినాబాద్‌లో ఒక ఫామ్ హౌస్‌లో శవమై తేలారు. ఆయన రివాల్వర్‌తో ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయ్ చనిపోయి ఉంటారని భావించి శశికుమార్ ఆత్మహత్య చేసుకుని ఉంటారని చెబుతున్నారు. మరోవైపు శశికుమార్ తన సూసైడ్ నోట్‌లో తన ఆత్మహత్యకు కారణం ఉదయ్, సాయి కుమార్‌లేనని, వారిద్దరూ తనను మోసం చేశారని పేర్కొన్నారు. ఉదయ్‌ను కాల్చింది సాయికుమార్ అని రాశారు. భార్యా పిల్లలు తనను క్షమించాలని పేర్కొన్నారు. శశికుమార్‌ను చంద్రకళ అనే మహిళ నిన్న సాయంత్రం కారులో ఫామ్ హౌస్‌ వద్ద డ్రాప్ చేశారని, తర్వాత ఆమె వెళ్ళిపోయారని, పోలీసులు చెప్పారు. మద్యం సేవించి ఆ మత్తులో శశికుమార్ ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఉదయ్‌పై కాల్పులు జరపటం, తన భర్త ఆత్మహత్య చేసుకోవటం అంతా నాటకమని, ఉదయ్, సాయికుమార్ కలిసి కుట్రచేసి కిరాయి హంతకులద్వారా తన భర్తను హత్య చేయించారని శశికుమార్ భార్య కాంతి, బంధువులు ఆరోపించారు. నిన్న ఉదయం సాయికుమార్ ఫోన్ చేసి తన భర్తను పిలిచారని చెప్పారు. వారు తమకు రు.2.5 కోట్లు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. డబ్బులు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చినందుకే హత్య చేయించారని ఆరోపించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ ల్యాండ్ చుట్టూనే తిరుగుతున్న మల్లారెడ్డి

తనకు ఐదు వందల ఎకరాలు ఉన్నాయని తనకు ఎవరి భూమి కబ్జా చేయాల్సిన పనే లేదని మల్లారెడ్డి తరచూ చెబుతూంటారు. కానీ ఓ స్థలం విషయంలో మాత్రం ఆయన నేరుగా రంగంలోకి...

సీఎస్‌ను తప్పిస్తే మొత్తం సెట్ రైట్ – ఎందుకు మార్చరు ?

ఏపీలో జరుగుతున్న సర్వ అవకతవకలకు కారణం చీఫ్ సెక్రటరీ. జగన్ రెడ్డి జేబులో మనిషిగా వ్యవహరిస్తూ వ్యవస్థలన్నింటినీ భ్రష్టుప్టటిస్తున్నారు. చివరికి అల్లర్లపై విచారణ చేయడానికి సిట్ అధికారులుగా ఏసీబీ వాళ్లను..సీఐడీలో పని...

ఏబీవీపై అవే కుట్రలు – భస్మాసుర సివిల్ సర్వీస్ ఆఫీసర్లు !

మీరు ఏది చేస్తే మీకు అది తిరిగి వస్తుందని గీత చెబుతోంది. చాలా మంది అధికారంలో ఉన్నప్పుడు చెలరేగిపోయి.. తర్వాత అలాంటివే తమకు జరుగుతూంటే.. గగ్గోలు పెడుతూంటారు.కానీ ఎవరి సానుభూతి రాదు. చరిత్రలో...

మౌనంగా విజయసాయిరెడ్డి – ఆడిటింగ్‌లోఉన్నారా ?

జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు విదేశాలకు వెళ్లినా విజయసాయిరెడ్డి కూడా వెళతారు. అయితే జగన్ వెళ్లిన దేశానికి కాదు. వేరే దేశాలకు వెళ్తారు. ఈ లింక్ ఏమిటో తెలియదు కానీ.....

HOT NEWS

css.php
[X] Close
[X] Close