ఆ సమస్య పరిష్కరించేము: రాజేంద్ర ప్రసాద్

తెలుగు మోవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు డా. రాజేంద్ర ప్రసాద్ గురువారం తిరుమలకి వచ్చినప్పుడు ఆయన మీడియా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా “నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఈయవలసిన డబ్బు గురించి నిర్మాతల మండలితో మాట్లాడి ఆ సమస్యను ఇద్దరికీ ఆమోదయోగ్యంగా పరిష్కరించాము,” అని అన్నారు.

పవన్ కళ్యాణ్ నటించిన అత్తారింటికి దారేది సినిమా విడుదలకు ముందే దాని పైరసీ కాపీలు మార్కెట్లోకి విడుదల కావడంతో, వాటి వలన సినిమా దెబ్బతినే ప్రమాదం ఉంటుందని, ఆ కారణంగా ఆ సినిమా నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నష్టపోకూడదనే మంచి ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఆయనకి రెండు కోట్లు తిరిగి ఇచ్చేరు. కానీ ఆ సినిమా ఊహించిన దానికంటే సూపర్ హిట్ అయ్యింది. కనుక నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ కూడా అదే మంచితనం ప్రదర్శించుకొని పవన్ కళ్యాణ్ కి ఆ డబ్బు వాపసు చేసి ఉండాలి. కానీ ఆయన ఆ తరువాత తీస్తున్న “నాన్నకు ప్రేమతో” సినిమా నిర్మాణానికి డబ్బుకి ఇబ్బంది పడుతున్నందున దాని విడుదల వరకు సమయం కోరారు. అందుకు పవన్ కళ్యాణ్ కూడా అంగీకరించారు. సినిమా విడుదలకి సన్నాహాలు పూర్తయ్యాయి కానీ నిర్మాత మాత్రం ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో పవన్ కళ్యాణ్ ‘మా’కి పిర్యాదు చేసారు. అప్పుడు మా అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ కలుగజేసుకొని సమస్యని పరిష్కరించారు. నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ విజ్ఞప్తి మేరకు పవన్ కళ్యాణ్ తనకు రావలసిన రెండు కోట్లలో రూ.50 లక్షలు తగ్గించుకొన్నారని సమాచారం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పరశురాం డబ్బులు వెనక్కి ఇస్తాడా ?

ఫ్యామిలీ స్టార్ నిరాశ పరిచింది. విజయ్ దేవరకొండ, పరసురాం సక్సెస్ కాంబినేషన్ లో మంచి అంచనాలతో వచ్చిన సినిమా అంచనాలని అందుకోలేకపోయింది. గీతగోవిందం మ్యాజిక్ మరోసారి వర్క్ అవుట్ అవుతుందని భావించారంతా. కానీ...

మాధవీలత ఆస్తులు ఎన్ని కోట్లో తెలుసా..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. పాతబస్తీ గడ్డపై బీజేపీ ఎగరేసి ఒవైసీకి ఓటమి రుచి చూపిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు....

ఎన్నికల వరకు జగన్ అంతే..!?

ఏపీ సీఎం జగన్ రెడ్డిపై రాయి దాడి జరిగి రెండు వారాలు కావొస్తోంది. బస్సు యాత్రలో భాగంగా ఓ వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటిపైన స్వల్ప గాయమైంది. బ్యాండేజ్...

పిఠాపురంలో వైసీపీ చీప్ ట్రిక్స్..!!

కుప్పం, పిఠాపురం...ఈ రెండు నియోజకవర్గాల్లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసీపీ కుట్రలకు పదును పెడుతోంది. చంద్రబాబుపై ఎంత బురద జల్లుతున్నా అవేవీ ప్రజలు విశ్వసించడం లేదు. దీంతో పిఠాపురంలో పవన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close