గ్రేటర్‌లో రాహుల్ – చంద్రబాబు జంటగా రోడ్‌ షోలు..!

తెలంగాణ రాష్ట్ర సమితిని ఓడించడానికి… మహాకూటమి ఏర్పడినా.. ఇక్కడ రాబోయే ఫలితం దేశం మొత్తం ప్రభావం చూపిస్తుంది. మూడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్, టీడీపీ వ్యతిరేక పక్షాలుగా ఉన్నాయి. ఈ రెండు పార్టీలూ కలిసి ఇప్పుడు పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళుతున్నాయి. సుదీర్ఘ వైరం, పరస్పర విరుద్ధ సిద్ధాంతాలున్న ఆ రెండు పార్టీల కార్యకర్తలు కలవరని, క్షేత్రస్థాయిలో ఓట్ల బదిలీ జరగదన్న అంచనాతో టీఆర్ఎస్ ఉంది. కేసీఆర్ కూడా ఇదే మాట తమ మాట అభ్యర్థులకు.. చెప్పి.. ధైర్యం కలిగించే ప్రయత్నం చేశారు. అయితే.. కేసీఆర్ అంచనా … కరెక్ట్ కాదని నిరూపించేందుకు… తమ మధ్య అరమరికలు లేవని చాటాలని నిర్ణయించుకున్నారు. శ్రేణుల ఏకీకరణకు రోడ్‌ షోలు నిర్వహించాలని నిర్ణయించారు.

రాహుల్, చంద్రబాబు విడివిడిగా ప్రచారం చేయడం కన్నా.. ఇద్దరూ కలిసి రోడ్ షోలు నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఈ మేరకు ఇరు పార్టీల అధిష్ఠానాలు పరస్పరం అంగీకారానికి వచ్చాయి. ప్రధానంగా గ్రేటర్ పరిధిలో వీరి ప్రచారం ఉండనుంది. గ్రేటర్ పరిధిలో ఉన్న దాదాపుగా 24 సెగ్మెంట్లలోనూ వీరి ప్రచారం ఉండే అవకాశం ఉంది. ఈనెల 22-30 మధ్య ఉమ్మడి రోడ్‌ షోలు ఉంటాయి. వరుసగా రెండు, మూడు రోజులపాటు వీటిని కొనసాగించేలా కసరత్తు జరుగుతోంది. గ్రేటర్ లో ఉన్న విభిన్నమైన పరిస్థితుల కారణంగా.. కూటమి గెలుస్తుందని నమ్మకం కలిగిస్తే.. ఓట్ల వెల్లువ రావడం ఖాయమే. కూటమి అధికారంలోకి వస్తుందన్న సానుకూల భావన కలిగించి, ఓట్లు చీలిపోకుండా రాహుల్, చంద్రబాబు ప్రచారం ఉపయోగపడుతుందని అంచనా వేస్తున్నారు.

రాహుల్, చంద్రబాబు సంయుక్త రోడ్ షోలు… సమీకరణాల్ని మార్చే అవకాశం ఉంది. అందుకే టీఆర్ఎస్.. ఈ విషయంలో విరుగుడు విమర్శలు ప్రారంభించింది. సీమాంధ్ర ఓటర్లలో… తెలుగుదేశం పార్టీపై విశ్వాసం లేదని.. చంద్రబాబును నమ్మడం లేదని చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. కేటీఆర్.. దాదాపుగా ప్రతీ మీడియా సమావేశంలోనూ అదే చెబుతున్నారు. తెలంగాణలో కూటమి సక్సెస్ అయితే.. అది.. జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలనుకున్న కూటమికి.. ఉత్ప్రేరకంగా పని చేస్తుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాల్ గారి పార్టీ టిక్కెట్ కోసం రూ. 50 లక్షలు ఇచ్చాడట !

సమాజంలో కొన్ని వింతలు జరగుతూ ఉంటాయి. నమ్మాలా వద్దో తేల్చుకోలేము. కేఏ పాల్ ఎల్బీ నగర్ టిక్కెట్ ఇస్తానంటే రూ. 50 లక్షలు పాల్ కు ఇచ్చేశాడట. చివరికి పాల్ టిక్కెట్ ఇవ్వలేదని...

“ఈ ఆఫీస్” భద్రం – స్పందించిన ఈసీ

ఏపీ ప్రభుత్వం జీవోలను అన్నీ దాచిన ఈ ఆఫీస్ ను అప్ గ్రేడేషన్ పేరతో సమూలంగా మాల్చాలనుకున్న ఏపీ ప్రభుత్వానికి ఈసీ చెక్ పెట్టింది. ఈ ఆఫీస్ అప్ గ్రేడేషన్ పేరుతో...

విజయ్ సేతుపతి నుంచి ఓ వెరైటీ సినిమా

హీరోగానే కాకుండా ప్రతి నాయకుడిగానూ కనిపించి ప్రేక్షకుల ఆదరణ సొంతం చేసుకున్న విలక్షణ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోయిజం లెక్కలు వేసుకోకుండా పాత్రలకు ప్రాధాన్యత ఇస్తూ ఆయన ప్రయాణం సాగుతోంది. ఇదే ఆయన్ని...

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close