చంద్రబాబు సీమ ప్రాజెక్ట్‌ల ప్రజెంటేషన్ – వైసీపీ మేధావులెక్కడ ?

పాలకుడికి ఓ విజన్ ఉండాలి. అది ఉండాలంటే మొత్తం సబ్జెక్ట్ పై అవగాహన ఉండాలి. అలా ఉన్నప్పుడే ఓ రోడ్ మ్యాప్ పెట్టుకుని మెల్లగా లక్ష్యంగా దిశగా వెళ్తారు. అసలేమీ తెలియకుండా.. వందల కొద్దీ సలహాదారుల్ని పెట్టుకుని బూతుల ప్రయోగాల్లో రాటుదేలిపోతే ప్రజలకు ఏం ఒరుగుతుంది ?

జగన్ రెడ్డిపై రాయలసీమ ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు . ఆయన చంద్రబాబుని ఆయన కుటుంబాన్ని .. పవన్ కల్యాణ్ ను బూతులు తిట్టిస్తారనే ఆశలు కాదు. రాయలసీమ ప్రజల నీటికష్టాలు తీరుస్తారని.. ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తారని.. బతుకులు మారుస్తారని ఆశలు పెట్టుకున్నారు. అందుకే రాయలసీమ మొత్తం ఆయనకు జై కొట్టింది. మూడు సీట్లు తప్ప… టీడీపీకి వచ్చిందేమీ లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ రెడ్డి చేయాలి. .? సీమ ప్రజల రుణం తీర్చుకోవాలి. కానీ ఏం చేస్తున్నారు ? వారి రక్తం తాగుతున్నారు కానీ.. భవిష్యత్‌కు భరోసా మాత్రం ఇవ్వడం లేదు .

చంద్రబాబు హయాంలో సీమను సస్యశ్యామలం చేసేందుకు ఓ మాస్టర్ ప్లాన్ రెడీ చేసుకుని ముందుకెళ్లారు. వేగంగా పనులు చేయిస్తూ నిధుల కొరత రాకుండా చేశారు. కానీ జగన్ రెడ్డి సర్కార్ వచ్చి మొత్తం ఆపేసింది. రివర్స్ టెండర్ల పేరుతో పనులన్నీ ఆపేశారు. మళ్లీ ప్రారంభం కాలేదు. కానీ వేల కోట్ల బిల్లులైతే బొక్కేశారు. సీమ ప్రాజెక్టులపై చంద్రబాబు ఇచ్చిన ప్రజెంటేషన్ చూసిన తర్వాత జగన్ రెడ్డి చేసిన అన్యాయంపై సీమలో ఎవరికైనా కడుపు మండిపోతుంది. ఇంత అన్యాయం చేస్తారా అని ఆవేశ పడకుండా ఉండలేరు.

కానీ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే సీమ ప్రయోజనాలు నీటి హక్కుల గురించి మాట్లాడే మేధావులు… ఎంత మంచి చేస్తున్నా… విమర్శలు చేసేవారు. ఇప్పుడు జగన్ రెడ్డి కొంప కూల్చేస్తున్నా…. భవిష్యత్ లోనూ నీటి అవసరాలు తీరకుండా చేస్తున్నా నోరెత్తడం లేదు. సీమకు అసలు శాపం.. .. ప్రజలకు నిజాలు చెప్పని.. కుల పరంగా రాజకీయాలు మేధావి ముసుగులోని మరుగుజ్జులే. రాయలసీమకు అసలైన శాపం వాళ్లే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేసీఆర్, కేటీఆర్ లేకపోతే తెలంగాణ ఏమైపోతుందో !?

బీఆర్ఎస్ లేకపోతే తెలంగాణను ఎవరో ఎత్తుకుపోతారన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తాము ఉన్నప్పుడంతా స్వర్గం.. ఇప్పుడు నరకం అని ప్రజలకు చెబుతున్నారు. విచిత్రం ఏమిటంటే.. కొత్తగా తాము లేకపోతే...

వాలంటీర్ల లేకపోతే ఇంటింటికి పెన్షన్లు ఇవ్వలేరా ?

ఒకటో తేదీన పించను ఇంటి వద్ద ఇవ్వడానికి ఉద్యోగులు సరిపోరని నమ్మించడానికి ఏపీ ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న వారు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. పించన్లను బ్యాంక్ అకౌంట్లలో...

కండోమ్స్ ఎక్కువగా వాడేది వారేనా..మోడీకి కౌంటర్

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోడీ ప్రసంగం ఆశ్చర్యపరుస్తోంది. గతానికి భిన్నంగా మాట్లాడుతుండటమే ఇందుకు కారణం.గాంధీ కుటుంబంపై మాత్రమే విమర్శలు చేసే మోడీ గత కొద్ది రోజులుగా రూట్ మార్చారు. కాంగ్రెస్ అకారంలోకి...

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close