మత్స్యకారులకిచ్చే దాని కన్నా ప్రకటనలు, సీఎం టూర్ ఖర్చే ఎక్కువ !

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మత్స్యకార భరోసా పథకానికి మీటనొక్కి నిధులు విడుదల చేయనున్నారు. కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినా పాత జిల్లాల ప్రకారమే లెక్కలు చెబుతూ.. మొత్తంగా ఓ లక్ష మందికి నగదు బదిలీ చేస్తున్నారు. అంటే సగటున నియోజకవర్గానికి ఐదారు వందల మంది ఉంటారు. ఇందు కోసం సీఎం టూర్ ఏర్పాటు చేశారు. ఆయనకు కాన్వాయ్ ఖర్చుల దగ్గర్నుంచి బహిరంగసభల వరకూ చాలా ఖర్చు పెట్టుకుంటున్నారు. సీఎం ఓ సారి జనంలోకి వెళ్తే అన్ని రకాల ఖర్చులు కలుపుకుని.. రూ. ఇరవై కోట్ల వరకూ అవుతాయని భావిస్తున్నారు.

పైగా ఇటీవల జగన్ ఎక్కడకు వెళ్లినా ప్రత్యేకంగా రహదారుల చుట్టూ బారీకేడ్లు పెట్టి… పరదాలు కట్టేస్తున్నారు. ఇలాంటి ఏర్పాట్లతో పాటు రాను..పోను హెలికాఫ్టర్లతో సహా చాలా ఖర్చులు ఉంటాయి. అలాగే ఆయన ఈ పథకానికి నిధుల మీట నొక్కుతున్నారని మీడియాలో ఫుల్ పేజీ ప్రకటనలు ఇస్తున్నారు. అన్నిప్రధాన పత్రికల్లో ప్రకటనలు ఇచ్చారు. డిజిటల్ మీడియాలోనూ విస్తృతంగా చేస్తున్నారు. ఇలాంటివన్నీ కలుపుకుంటే… అసలు ఇచ్చే దాని కన్నా ఆ పేరుతో చేసుకునే ప్రచారానికే ఎక్కువ ఖర్చు పెడుతున్నట్లుగా కనిపిస్తోంది. నిజానికి ఈ సారి మత్య్సకార భరోసా లబ్దిదారులపై అదనపు ఆంక్షలు పెట్టి సగం మందికి పథకం వర్తించదని చెప్పేశారు.

ఇంట్లో చేపల వేటకు వెళ్లేవారు ఎంత మంది ఉన్నా… ఒక్కరికే ఇస్తామని చెప్పారు. ఇతర పథకాలు వర్తించే వారి పేర్లను జాబితా నుంచి తొలగించారు. ఇలాంటి విన్యాసాలు చేసిమిగిలిస్తున్న డబ్బును ఇలా ప్రచారానికి.. పర్యటన ఖర్చులకు వాడుతున్నారు. అసలు మంచి చేయడం కన్నా.. మంచి చేసినట్లుగా ప్రచారం చేసుకోవడం మంచిదని ప్రభుత్వం ఫీలవుతున్నట్లుగా కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close