ఈసీ ఫెయిల్యూర్ – పోస్టల్ బ్యాలెట్స్ ఇలానా ?

ఏపీ ఎన్నికల సంఘం పనితీరు అత్యంత ఘోరంగా ఉంది. కనీసం పోస్టల్ ఓటింగ్ ను సరైన పద్దతిలో నిర్వహించడం కూడా చేత కాలేదు. పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ స్మూత్ నిర్వహించడానికి నియమ నిబంధనలు పటిష్టంగా ఉంటాయి. ఎలా సింపుల్ గా అయిపోతుందో అంచనా వేసుకుని దానికి తగ్గట్లుగా పూర్తి చేయాలి. కానీ ఈసీ మొదటి నుంచి ఓ రకమైన తప్పుడు మార్గంలో వెళ్లింది. గందరగోళంతో ఎక్కువ మంది ఓట్లు వేయకపోతే చాలన్నట్లుగా వ్యవహరించింది.

మొదట పోస్టల్ బ్యాలెట్ కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలన్నది పెద్ద పజిల్ గా మార్చారు. నియోజకవర్గాల గందరగోళం ఏర్పరిచారు. మీడియాలో ఇదేం పని అని ప్రశ్నలు వినిపించడంతో రెండు రోజులు గడువు పెంచారు. ఫామ్ 12 తీసుకున్న తర్వాత పోస్టల్ బ్యాలెట్ల వినియోగంపై ఎం చేయాలన్నదానిపైనా గందరగోళం సృష్టించారు. చివరికి ఓటింగ్ విషయంలో ఏర్పడిన పరిస్థితులు చూసిన తర్వాత .. ఇలాంటి ఈసీనా సాధారణ ఎన్నికలు నిర్వహించేది అని ఆశ్చర్యం కలగడం సహజం.

ఎన్నికల నిర్వహణ చేతకాకపోతే మరో సమర్థమైన అధికారితో చేయించుకోవాలి.. కానీ ఈ వ్యవహారం అంతా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్లుగా ఉంది. ఎన్నికల విధుల్లో ఉండే ఉద్యోగులతో ఓట్లు వేయించకపోతే మంచిదన్న భావనకు వస్తున్నట్లుగా వ్యవహారం ఉంది. ఎవరైనా ఓటింగ్ పెంచాలనుకుంటారు కానీ.. ఇలా ఈసీ నిర్వాకంతో తగ్గిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది ఖచ్చితంగా ఈసీ ఫెయిల్యూల్ గానే కనిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటే ఏపీకి ఏం ఉపయోగం !?

విభజన చట్టంలో ఉన్న ఉమ్మడి రాజధాని అంశానికి జూన్ రెండో తేదీన ముగింపు రాబోతోంది. మరోసారి పొడిగింపు అసాధ్యం అని తెలిసినా సరే కొంత మంది ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ను కొనసాగించాలనే...

డ్రగ్స్ పార్టీ కేసు వైసీపీ చుట్టే తిరుగుతోంది !

డ్రగ్స్ అంటే వైసీపీ పేరు ఖచ్చితంగా వస్తోంది. ఏదో ఆషామాషీగా మీడియాలో వచ్చే కథనాలు కాదు. నేరుగా పోలీసు కేసుల్లో ఇరుక్కుంటున్నవారు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో ఏ 2గా నిలిచిన...

పల్లీబఠాణి కామెంట్స్‌తో రాకేష్ రెడ్డిని ముంచిన కేటీఆర్

బిట్స్ పిలానీ గొప్ప కావొచ్చు కానీ మిగతా గ్రాడ్యూయేట్స్ అంతా పల్లీ బఠాణీలు అంటే ఎలా ?. కేటీఆర్ ఇది ఆలోచించలేదు. ప్రాస బాగుంది కదా అని అనేశారు. ఇప్పుడు...

నో రిఫండ్ బుకింగ్ – 9కి విశాఖ హోటల్స్ రెడీ !

వైసీపీ నేతలు చేస్తున్న అతి కారణంగా విశాఖలో 9వ తేదీన హోటల్స్ నిండిపోతున్నాయని సోషల్ మీడియాలో అనుకుంటున్నారు. కానీ ఆ రోజున విశాఖలో ఉన్న హోటళ్లలో ఇప్పటికే వందల కొద్ది రూములు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close