అమరావతి కళకళాలాడుతోంది. వందల మంది కార్మికులు రేయింబవళ్లు పనిచేస్తున్నారు. అన్ని విధానాలుగా నిధుల సర్దబాటు జరగడంతో అమరావతి పనులు ఇక నిరాటంకంగా సాగడమే మిగిలింది. ఇప్పటికే దాదాపుగా అరవై వేల కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. పనులు అప్పగించారు. కాంట్రాక్ట్ సంస్థలు రంగంలోకి దిగాయి.
ఐకానిక్ భవనాల నిర్మాణ పనుల ప్రారంభానికి భారీ యంత్రాలను తెచ్చుకుంటున్నారు. మెటీరియల్ పనులు ప్రారంభమయ్యాయి. ఇతర భవనాల పనులు ఇరవై నాలుగు గంటల పాటు మూడు షిఫ్టుల్లో జరుగుతున్నాయి. ఐదు సంవత్సరాల పాటు అక్కడ ఎలాంటి పనులు జరగలేదు. కానీ ఇప్పుడు మాత్రం మళ్లీ ఉపాధికేంద్రంగా మారుతోంది. వందల మంది పని వాళ్లు ఇతర ప్రాంతాల నుంచి అమరావతికి వచ్చారు.
కాంట్రాక్ట్ సంస్థలు అన్నీ బడా కంపెనీలు కావడంతో అత్యాధునిక టెక్నాలజీతో.. శరవేగంగా పనులు చేయిస్తున్నారు. పనుల గడువు ప్రకారం పూర్తిచేయాల్సి ఉంటుంది. వచ్చే రెండేళ్ల కాలంలో.. ప్రభుత్వ నిర్మాణాలన్నీ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. స్థలాలు తీసుకున్న ప్రైవేటు కంపెనీలు కూడా పెద్ద ఎత్తున నిర్మాణాలు ప్రారంభించాల్సి ఉంది. కొన్ని కంపెనీలు ఇప్పటికే నిర్మాణాల అనుమతులు తీసుకున్నాయి. వచ్చే రెండు నెలల్లో చాలా ప్రైవేటు కంపెనీలు నిర్మాణాలు ప్రారంభించనున్నాయి.
విజిబుల్ డెలవప్మెంట్ కనిపిస్తే.. అమరావతి రియల్ ఎస్టేట్ ఆటోమేటిక్గా పుంజుకునే అవకాశాలు ఉన్నాయి.