టీడీపీలోకి దాడి వీరభద్రరావు..! చంద్రబాబు గ్రీన్ సిగ్నల్..!!

మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన ఇంటికి వెళ్లి పవన్ కల్యాణ్ జనసేనలో చేరాలని ఆహ్వానించారు. అనుచరులతో మాట్లాడి చెబుతానని దాడి వీరభద్రరావు పవన్ కు చెప్పారు. ఆ తర్వాత సైలెంటయిపోయారు. కానీ టీడీపీలో చేరేందుకు మాత్రం ప్రయత్నాలు కొనసాగించారు. పవన్ కల్యాణ్ తన ఇంటికి వచ్చిన తర్వాత ఎపీ టీడీపీ అధ్యక్షులు కళా వెంకట్రావుకు దాడి వీరభద్రరావు ఫోన్ చేశారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆసక్తి కనబరిచారు. ఇదే విషయాన్ని తన మాటగా పార్టీ అధినేత చంద్రబాబుకు చెప్పాలని దాడి వీరభద్రరావు కోరారు.

దాడి వీరభద్రరావు మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉన్న నేత. గత ఎన్నికలకు ముందు వరకూ ఎమ్మెల్సీగా ఉన్నారు. మళ్లీ తనకు ఎమ్మెల్సీ పొడిగింపు ఇస్తారని భావించారు. కానీ చంద్రబాబు యనమల రామకృష్ణుడికి అవకాశం ఇచ్చారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన దాడి వీరభద్రరావు తెలుగుదేశం పార్టీకి ాజీనామా చేసి వైసీపీలో చేరిపోయారు. అక్కడ ఆయనకు పోటీ చేసే అవకాశం దక్కలేదు. ఆయన కుమారుడికి జగన్ టిక్కెట్ ఇచ్చినా ఓడిపోయారు. ఆ తర్వాత వైసీపీలో ఇమడలేక బయటకు వచ్చేశారు. టీడీపీ అధినేత ఆహ్వానిస్తే పార్టీలో చేరుతానని… గతంలో ఓ సందర్భంలో ప్రకటించారు కూడా. ప్రస్తుతం తటస్థంగా ఉన్న దాడి స్వగృహప్రవేశానికి లైన్ క్లియర్ అయింది.

దాడి వీరభద్రరావును టీడీపీలో చేర్చుకోవడానికి చంద్రబాబు అంగీకరించారు.అయితే టిక్కెట్ల హామీలేమీ లేకుండా.. పార్టీలో పని చేసుకునేవిధంగా అయితేనేనని షరతు పెట్టారు. ఇదే విషయాన్ని కళా వెంకట్రావు.. దాడి వీరభద్రరరావుకు స్పష్టం చేశారు. దానికి దాడి వీరభద్రరావు అంగీకరించారు. మంచి ముహుర్తం చూసుకుని ఆయన తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు, ఉత్తరాంధ్రకు చెందిన మరో నేత కూడా తెలుగుదేశం పార్టీలోకి వచ్చేందుకు ఆసక్తిని కనబరుస్తున్నప్పటికీ చంద్రబాబు నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ లభించలేదు. కొంత మంది పార్టీ నేతలు అడ్డుపడుతూండటంతో సమీకరణాలు కుదరడం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close