మ‌హాన‌టిలో.. ఈ ఇద్ద‌రు ద‌ర్శ‌కులు..?

సావిత్రి ఆత్మ‌క‌థ‌… ‘మ‌హాన‌టి’ పేరుతో తెర‌కెక్కుతోంది. నాగ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో సావిత్రిగా కీర్తి సురేష్ క‌నిపించబోతున్న సంగ‌తి తెలిసిందే. స‌మంత‌కీ ఓ కీల‌క‌మైన పాత్ర ద‌క్కింది. ఎన్టీఆర్‌, ఏఎన్నార్ గా ఎవ‌రు క‌నిపిస్తార‌న్న ఆస‌క్తి నెల‌కొంది. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు క్రిష్‌, అవ‌స‌రాల శ్రీ‌నివాస్ ఈ చిత్రంలో `న‌టులు`గా క‌నిపించ‌బోతున్నార్ట‌. అల‌నాటి ద‌ర్శ‌కులు కెవి రెడ్డి, ఎన్వీ ప్ర‌సాద్ పాత్ర‌ల కోసం వీరిద్ద‌రినీ తీసుకొన్నార‌ని స‌మాచారం. అవ‌స‌రాల ఆల్రెడీ న‌టుడే. న‌ట‌న నుంచి ద‌ర్శ‌క‌త్వం వైపు అడుగులు వేశాడు. క్రిష్ త‌న సినిమాల్లో అప్పుడ‌ప్పుడూ తెర‌పై మెరుస్తుంటారు. అందుకే ఈ పాత్ర‌ల కోసం వీరిద్ద‌రినీ సంప్ర‌దించార‌ని, ‘సావిత్రి’ సినిమా అందులోనూ హేమా హేమీలు కాబ‌ట్టి… ఆయా పాత్ర‌ల్లో క‌నిపించ‌డానికి రెడీ అయ్యార‌ని టాక్‌. అవ‌స‌రాల‌, క్రిష్ క‌నిపించేది కాసేపే అయినా, వాటిని ఆక‌ట్టుకొనేలా తీర్చిదిద్దార‌ని స‌మాచారం. క్రిష్‌, అవ‌స‌రాల రావ‌డంతో.. ఈ సినిమాకి మ‌రో ప్ర‌త్యేక‌త వ‌చ్చి చేరిన‌ట్టైంది. ఎంత మంది వ‌స్తున్నా.. ఎన్టీఆర్ – ఏఎన్నార్ పాత్ర‌లు మాత్రం ఖాళీగా ఉన్నాయి. ఆ రెండు పోస్టులూ భర్తీ అయితే.. `మహాన‌టి` రేంజే వేరేలా ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈ ప్ర‌శ్న‌కు బ‌దులేది జ‌క్క‌న్నా..?!

RRR.... ఇండియ‌న్ ఫిల్మ్ ఇండ‌స్ట్రీలోనే ఓ చ‌రిత్ర‌. వ‌సూళ్ల ప‌రంగా, రికార్డుల ప‌రంగా, అవార్డుల ప‌రంగానూ... ఈ సినిమాకు తిరుగులేదు. మ‌ల్టీస్టార‌ర్ స్టామినా పూర్తి స్థాయిలో చాటి చెప్పిన సినిమా ఇది. తెలుగు...

నో హోప్స్ : డబ్బుల పంపకంపై జగన్ సిగ్నల్ ఇచ్చారా ?

చంద్రబాబులా నా దగ్గర డబ్బల్లేవు.. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకుని నాకే ఓటేయండి అని జగన్ రెడ్డి ఎన్నికల ప్రచారసభల్లో తన ప్రచార స్పీచ్‌లలో కొత్తగా చెబుతున్నారు. జగన్ దగ్గర డబ్బుల్లేవా అని వైసీపీ...

కాంగ్రెస్‌లో మల్లారెడ్డి కోవర్టులా .. అసలు కాంగ్రెస్ కోవర్టే మల్లారెడ్డినా ?

మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో తన కోవర్టులున్నారని ప్రకటించుకున్నారు. ఎవరయ్యా వాళ్లు అంటే.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కాంగ్రెస్ లోకి జంప్ అయిన వాళ్లు. వాళ్లందర్నీ తానే కాంగ్రెస్ లోకి పంపానని...

ఈసీ ఆదేశించకుండానే షర్మిలపై కేసులు కూడా !

ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు సంబంధించిన ప్రకటనలు.. వ్యవహారాలు అన్నీ ఈసీ పరిధిలోకి వస్తాయి. కోడ్ ఉల్లంఘిస్తే.. చర్యలు ఈసీ తీసుకోవాలి. కానీ ఏపీలో రాజ్యాంగం వేరుగా ఉంటుంది. ఎన్నికల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close