కరెక్ట్ ఓటర్ల జాబితా కూడా సిద్ధం చేయలేకపోతే ఇక ఈసీ ఎందుకు !?

ఏపీలో ఓటర్ జాబితా అంశం సంచలనంగా మారింది. అడుగడుగునా ఫేక్ ఓట్లు బయటపడుతున్నాయి. అర్హులైన వారి ఓట్ల తొలగింపులు వెలుగులోకి వస్తున్నాయి. స్వయంగా సీఈవో కూడా ఇది నిజమేనని కరెక్ట్ చేస్తామని అంగీకరించాల్సి వచ్చింది. తర్వాత సీఈవోను.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పిలిచి క్లాస్ తీసుకున్నారన్న ప్రచారమూ జరిగింది. ఇదంతా వాలంటీర్ల వల్లే జరిగిందని అందరికీ తెలుసు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా మళ్లీ వారి సాయంతోనే ఓటర్ల జాబితాను సవరించడం సంచలనంగా మారుతోంది.

ఆ మధ్య జరిగిన ఉపఎన్నికల్లో .. మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేసేందుకు పెద్ద ఎత్తున టూరిస్ట్ బస్సుల్లో రావడం సంచలనం రేపింది. చివరికి గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ తిరుపతిలో తమిళనాడు నుంచి ఓట్లు వేశారు. కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లేయడానికి తమిళనాడు నుంచి వందల బస్సుల్లో వచ్చారు. ఇవన్నీ అందరి కళ్ల ముందే జరిగాయి. కానీ ఈసీ మాత్రం పట్టించుకోలేదు. ఓటుకు ఆధార్ అనుసంధానం చేసేందుకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కానీ అది తప్పనిసరి కాదు. ఓటర్ కు ఇష్టమైతేనే ఇవ్వొచ్చు.

ఆధార్ లేదన్న కారణంగా ఓటు హక్కు నిరాకరించలేరు. ఇక్కడే దొంగ ఓట్లను చేర్చుకోవడానికి.. తమకు అనుకూలం కాని పార్టీల ఓటర్లను తొలగించడానికి ఓ అవకాశంగా చేసుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. పెద్ద ఎత్తున ఓట్ల గల్లంతు ఆరోపణలు ఇందుకే వస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో అధికారుల ప్రమేయంతోనే ఇలా జరుగుతాయి. అందుకే టీడీపీ నేత పయ్యావుల కేశవ్.. నేరుగా సీఈసీకి ఫిర్యాదు చేశారు. అక్కడ్నుంచి ఓ ప్రత్యేక టీమ్ ను.. ఉరవకొండకు పంపించారు. దీంతో అక్రమాలు బయటపడ్డాయి. బీఎల్వోలను సస్పెండ్ చేశారు. రాష్ట్రం మొత్తం అంతే ఉందన్న సంగతిని మర్చిపోయారు.

ప్రజలందరూ..ఎవరి ఓట్లను వారు స్వేచ్చగా ఓటు వేసినప్పుడే ప్రజాస్వామ్యానికిసార్థకత ఉంటుంది. తమకు ఇష్టం లేనివారి ఓట్లను తీసేసి అనుకూలమైన వారితో ఓటింగ్ చేయించుకుని గెలిచామని అనుకుటే అది నియంతృత్వానికి దారి తస్తుందన్న వాదన ఉంది. ఓటర్ల జాబితాను రూపొందించడం… కూడా ఈసీకి చేతకాకపోతే ఇక ఎన్నికల నిర్వహణ ఎలా చేయగలుగుతుందేది ఎవరికైనా వచ్చే డౌట్.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో పవన్‌పై పుకార్ల కుట్రలు !

పవన్ కల్యాణ్ గెలిస్తే అసెంబ్లీలో అడుగుపెడితే తాము చూస్తూ బతకలేమని చస్తూ బతకాలని అనుకుంటున్నారేమో కానీ వైసీపీ నేతలు ప్రతి అడ్డమైన వ్యూహాన్ని పాటిస్తున్నారు. రాత్రికి రాత్రి పిఠాపురం వర్మ వైసీపీలోకి...

ఆర్కే పలుకు : జగన్‌ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కూ ఉంది !

జగన్ ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కు ఉందా ?. ముందు తెలంగాణలో పార్లమెంట్ సీట్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాత్రం రేవంత్ కు ఉంది. అందుకే ఆయన కిందా మీదా పడుతున్నారు....

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close