కరెంట్ చార్జీలు పెంచలేదని చెబుతూంటే ఎవరూ నమ్మరేంటి..?

విద్యుత్ బిల్లులు పెంచలేదని ఏపీ సర్కార్ పెద్దలు, అధికారులు రోజూ ప్రెస్‌మీట్ పెట్టి చెబుతున్నారు. కానీ ప్రజలు మాత్రం ఎవరూ వినడం లేదు. మాకు కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందంటే..మాకు ఎక్కువ వచ్చిందంటూ… ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తున్నారు. తాము ఎక్కడి నుంచి తెచ్చి కడతామంటూ అసలు బిల్లులు కట్టడమే మానేస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా.. . ఒక్క నెల మీటర్ రీడింగ్ తీయకపోవడనే…ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థలకు ఎక్కడ లేని కష్టం వచ్చింది. రెండు నెలలకు ఒకే సారి రీడింగ్ తీశారు. ఎక్కువ యూనిట్లు వాడేసి ఉంటారు కాబట్టి..సహజంగానే శ్లాబ్ మారిపోతుంది.

శ్లాబ్ మారిపోతే… వంద వచ్చే బిల్లు వెయ్యి అవుతుంది. బిల్లులు ఇచ్చేటప్పుడే ఇలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాల్సింది. కానీ.. మొత్తం కలిపి బిల్లు ఇచ్చేయడంతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చెప్పా పెట్టకుండా రేట్లు పెంచారంటూ.. మండిపడుతున్నారు. దీనిపై వివరణ ఇచ్చుకోవడానికి విద్యుత్ శాఖ ఉన్నతాధికారులకు సమయం సరిపోవడం లేదు. వేలకు వేలు బిల్లులు ఇస్తే…తాము ఎక్కడి నుంచి తెచ్చి కట్టాలనే ప్రశ్నలు వస్తూండటంతో.. జూన్ పదిహేనో తేదీ లోపు ప్రత్యేకంగా అపరాథ రుసుమలు లేకుండా కట్టొచ్చని ఆఫర్ ఇస్తున్నారు.

కానీ ప్రజలు మాత్రం.. అసలు వాస్తవంగా తాము వాడుకునేదానికి కడతాం కానీ.. ఎంత సమయం ఇచ్చినా…ఎక్కువ ఎందుకు కడతామని ప్రశ్నిస్తున్నారు. మంత్రులకు కూడా ఇదే అంశంపై అదే పనిగానిరసనలు,విజ్ఞాపనలు వస్తూండంతో.. వారు కూడా కరెంట్ చార్జీలు పెంచ లేదని చెప్పడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ సమస్యకు ఎలా పరిష్కారం చూపించాలా అని పెద్దలు తలలు పట్టుకోవాల్సి వస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=Eou1oqvFa9COa1uy విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close