ఫటాఫట్ కేసీఆర్..! రెండు, మూడు రోజుల్లో గ్రేటర్ నోటిఫిషన్..!?

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇలా అనుకుంటే.. అలా చేసేస్తారు. దుబ్బాక ఎన్నికల తర్వాత గ్రేటర్ ఎన్నికలను వాయిదా వేస్తారన్న అంచనాల నేపధ్యంలో భయపడే ప్రశ్నే లేదని సంకేతాలు ఇస్తున్నారు. గ్రేటర్ ఎన్నికలను ఇప్పటికే బ్యాలెట్ విధానంలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ కారణంగా వీలైనంత వేగంగా… ఎన్నికలు పూర్తి చేయాలనే ఆలోచనకు వచ్చారు. డిసెంబర్ నాలుగో తేదీన పోలింగ్ పెడితే ఎలా ఉంటుందన్నదానిపై ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారు. మంత్రులు.. ఇతర కీలక నేతలతో కేసీఆర్ ఈ అంశంపై సంప్రదింపులు జరుపుతున్నారు.

ఈ విషయంలో ప్రభుత్వం తరపున ఎస్ఈసీతో సంప్రదింపులు జరుపుతున్నారు. దీపావళి అయిన మరుసటి రోజునే.. నోటిఫికేషన్ వస్తుందని.. ఎస్ఈసీ వర్గాలు చెబుతున్నాయి. పదమూడో తేదీతో గ్రేటర్ హైదరాబాద్ ఓటర్ల జాబితాలు డివిజన్ల వారీగా రెడీ అవుతాయి. ఆ తర్వాత ఎప్పుడైనా నోటిఫికేషన్ రావొచ్చని ఎస్ఈసీ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి. అయితే ఆ తర్వాత దుబ్బాక ఫలితాలు రావడం… ప్రభుత్వం వెనక్కి తగ్గిందని ప్రచారం జరగడంతో.. ఇక ఇప్పుడల్లా జరగవని అనుకున్నారు.

అయితే ఎన్నికలు వాయిదా వేస్తే ప్రజల్లోకి ఇంకా నెగెటివ్ సంకేతాలు వెళ్తాయని.. టీఆర్ఎస్ హైకమాండ్ అంచనాకు రావడంతో ఎన్నికలను వీలైనంత వేగంగా పెట్టి.. కంప్లీట్ చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఈవీఎంలతో ఎన్నికలు నిర్వహించేది లేదని.. ఇప్పటికే ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ అధికారులు కూడా ప్రభుత్వం ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తే అప్పుడు.. నిర్వహిస్తానమని.. సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close