ఎంత కాలమైనా హుజురాబాద్‌లోనే హరీష్ మకాం !

హరీష్ రావు హుజురాబాద్ నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. ఉపఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలీదు. కానీ ఆయన మాత్రం కేసీఆర్ ఇచ్చిన బాధ్యత మేరకు హుజురాబాద్‌పైనే పూర్తి స్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. ఏదో ఓ కార్యక్రమం చేపడుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. హుజురాబాద్‌లో రెడ్డిసామాజికవర్గం ఈటల వైపు మొగ్గుతో ఉందని అంచనా వేసి ఆ సామాజికవర్గ ప్రజలను ఆకట్టుకోవడానికి కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి .. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చేశారు.

ఈటల ఒక్క ఇల్లు కూడా కట్టించలేదని తాము ఐదు వేల ఇళ్లు కట్టిస్తామని.. అలాగే ఇంటి స్థలం ఉన్న రెడ్లకు ఇళ్లు కట్టుకునేందుకు ఆర్థిక సాయం చేస్తామనే హామీల వర్షం గుప్పిస్తున్నారు. ఒక్క రెడ్డి సామాజికవర్గమనే కాదు వరుసగా ఇలా కులపరమైన మీటింగ్‌లు పెడుతూ హరీష్ హామీలు ఇస్తున్నారు. ఆయా కులాల్లోని ప్రముఖులకు తాయిలాలు కూడా ఇస్తున్నారన్న ప్రచారం ఉంది. హుజురాబాద్ బాధ్యతను ఒక్క హరీష్‌కే ఇవ్వడంతో ఆయన మాత్రమే కష్టపడుతున్నారు. ఇతర నేతలు లైట్ తీసుకుంటున్నారు.

కేటీఆర్ అయితే అదో చిన్న ఎన్నిక అని సందర్బం ఉన్నా లేకపోయినా చెబుతున్నారు. హుజురాబాద్‌లో ఇద్దరు మిత్రుల పోరాటం అన్నట్లుగా మారిపోయింది. ఈటల , హరీష్ రావు వ్యక్తిగత విమర్శలు కూడా చేసుకుంటున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియదు కానీ హరీష్ కు మాత్రం చాలా పెద్ద టాస్కే పడిందని నేతలు గుసగుసలాడుకుంటున్నారు. గెలిస్తే హరీష్‌కు ఏమైనా ప్రయోజనం ఉంటుందో లేదో కానీ.. ఓడిపోతే మాత్రం హరీష్ కు గడ్డు పరిస్థితేనని టీఆర్ఎస్‌లో ఇప్పటికే చర్చలు జరుగుతున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో ఉద్రిక్తత… రంగంలోకి కేంద్ర బలగాలు..!!

ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పలు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తుతుండటంతో ఈసీ సీరియస్ అయింది. పల్నాడు జిల్లాలో 144సెక్షన్ విధించాలని జిల్లా...

యాక్షన్ లోకి దిగిన హీరోయిన్స్

గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులని ఫిదా చేసే హీరోయిన్స్ యాక్షన్ బరిలో దిగుతున్నారు. హీరోలకు ధీటుగా పోరాటాలు చేస్తూ యాక్షన్ చిత్రాలతో సై అంటున్నారు. ఒకరు తుపాకీ పట్టుకొని బుల్లెట్ల వర్షం కురిపిస్తే.. మరొకరు...

వైసీపీ : 2019లో కాన్ఫిడెన్స్‌కా బాప్ – ఇప్పుడు సైలెంట్

2019లో ఏపీలో ఎన్నికలు మొదటి విడతలోనే పూర్తయ్యాయి. ఎన్నికలు అయిపోయిన మరుక్షణం వైసీసీ రంగంలోకి దిగిపోయింది. అప్పటికే ఈసీ ద్వారా నియమింప చేసుకున్న ఉన్నతాధికారుల అండతో ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు....

రూ. 21వేల కోట్లు – దోచేస్తారా ?

ఏపీ ప్రభుత్వం దగ్గగర ఇప్పుడు ఇరవై ఒక్క వేల కోట్లుకపైగానే నిధులు ఉన్నాయి . పోలింగ్ కు ముందు ప్రజలఖాతాల్లో వేయాల్సిన పధ్నాలుగు వేల కోట్లతో పాటు ఆర్బీఐ నుంచి తాజాగా తెచ్చిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close