ఫేక్‌న్యూస్ ఎఫెక్ట్ : రాజ్‌దీప్‌పై రెండు వారాలు వేటేసిన ఇండియాటుడే..!

ఇంగ్లిష్ న్యూస్ చానల్ యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. రైతుల ఆందోళనల నేపధ్యంలో తప్పుడు వార్తలు ప్రచారం చేసిన ప్రముఖ జర్నలిస్ట్ రాజ్ దీప్ సర్దేశాయ్‌పై రెండు వారాలు వేటు వేసింది. ఆయనను రెండు వారాల పాటు స్క్రీన్ పైకి రాకుండా వేటు వేసింది. అంతే కాదు.. ఒక నెల రోజుల పాటు జీతాన్ని కత్తిరించాలని నిర్ణయించింది. ఇండియా టుడే యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం మీడియా వర్గాల్లో హైలెట్ అవుతోంది. ఎందుకంటే ఆయన ఆ చానల్‌కు కన్సల్టింగ్ ఎడిటర్ స్థాయిలో ఉన్నారు. ప్రైమ్ టైమ్ లో ఆ చానల్ కార్యక్రమాలను నిర్వహిస్తారు.

రైతుల ట్రాక్టర్ల ర్యాలీ ఢిల్లీలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఓ రైతు చనిపోయాడు. ఆయన పోలీసు కాల్పుల్లోనే చనిపోయాడని.. రాజ్ దీప్ సర్దేశాయ్ ప్రచారం చేశారు. ఎన్డీటీవీ ప్రచారాన్ని ఇతర మీడియా సంస్థలు హైలెట్ చేశాయి. దీంతో రైతులపై పోలీసులు కాల్పులు జరిపారన్న ప్రచారం ఉద్ధృతంగా సాగింది. అయితే పోలీసులు శరవేగంగా స్పందించారు. ఆ రైతు చనిపోయిన ప్రదేశంలో ఉన్న సీసీ టీవీ ఫుటేజీని విడుదల చేశారు. వేగంగా వచ్చిన ట్రాక్టర్ బోల్తా పడటంతో అందులో ఉన్న రైతు తీవ్ర గాయాల పాలై చనిపోయారని పోలీసులు ప్రకటించారు. సీసీ టీవీ ఫుటేజీలోనూ అదే ఉంది. దాంతో రాజ్ దీప్ సర్దేశాయ్ తప్పు చేసినట్లుగా తేలింది.

భారతీయ జనతా పార్టీకి రాజ్ దీప్ సర్దేశాయ్ వ్యతిరేకంగా ఉంటారన్న ప్రచారం ఉంది. గతంలో ఆయనపై అమెరికాలో మోడీ పర్యటన సందర్భంగా బీజేపీ కార్యకర్తలు దాడి కూడా చేశారు. రిలయన్స్ గ్రూప్ చేజిక్కించుకోక ముందే సీఎన్ఎన్ ఐబీఎన్‌లో కీలక పాత్ర పోషించేవారు. న్యూస్ 18చేతికి ఆ చానల్ వెళ్లిన తర్వాత బయటకు వెళ్లాల్సి వచ్చింది. తర్వాత ఇండియా టుడేలో చేరారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

ఓటేస్తున్నారా ? : ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి తెలుసుకోండి !

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే...

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close