అఖిల్ కి జోడిగా జాన్వీ కపూర్ !

అక్కినేని అఖిల్ బాలీవుడ్ ఎంట్రీ దాదాపు ఖరారైయింది. బాలీవుడ్ స్టార్ నిర్మాత కరణ్ జోహార్, అఖిల్ తో ఓ పాన్ ఇండియా సినిమా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకి సంబధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమాలో అఖిల్ కు జోడిగా జాన్వీ కపూర్ నటించే అవకాశం వుంది. జాన్వీ ఎప్పటినుంచో తెలుగులో నటించాలని అనుకుంటుంది. శ్రీదేవి ఉన్నప్పుడే జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ కోసం చర్చలు జరిగాయి. మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ .. ఇలా చాలా మంది హీరోల సినిమాల్లో ఆమె పేరుని పరిశీలిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు కుదరలేదు.

అయితే ఇప్పుడు కరణ్ జోహార్ ఈ జోడిని ఫిక్స్ చేశారని తెలిసింది. ఇటివల బోణీ కపూర్ కూడా హైదరాబాద్ వచ్చినపుడు జాన్వీ టాలీవుడ్ ఎంట్రీ అతి త్వరలో వుంటుందని చెప్పారు. ఇది అఖిల్ సినిమానే అయ్యే అవకాశాలు పుష్కలంగా వున్నాయి. జాన్వీ టాలీవుడ్ ఎంట్రీకి ఒక ప్రత్యేకత వుంది. శ్రీదేవిని అతిలోకరాశి ఆదరించారు తెలుగు ప్రేక్షకులు. ఇప్పుడు ఆమె కుమార్తె వస్తుందంటే శ్రీదేవి అభిమానించే ప్రేక్షకులకు ఆనందమే. అంతేకాదు గతంలో నాగార్జున – శ్రీదేవి కలసి నటించారు. ఇప్పుడు వారి వారసులు స్క్రీన్ పంచుకోవడం కూడా ఒక ప్రత్యేక ఆకర్షణే. ప్రస్తుతం ఏజెంట్ సినిమా చేస్తున్నాడు అఖిల్. ఈ సినిమా పూర్తయిన వెంటనే.. పాన్ ఇండియా సినిమా మొదలౌతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close