జగన్ భయపడ్డారా ?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీలో నిర్ణయాల విషయంలో ఆయన ఎప్పుడూ ఆలోచించలేదు. ఏదనుకుంటే అది చేశారు. ఎవరికి పదవి ఇవ్వాలనుకుంటే వారికి ఇచ్చారు. ఎవర్ని తీసేయాలనుకుంటే వార్ని తీసేశారు. అయితే ఇప్పుడు ఆయన ఈ విషయంలో కొంత వెనుకడుగు వేస్తున్నారు. ఈ విషయం మంత్రివర్గ ప్రక్షాళన అంశంలోనే తేలిపోతోంది. వందకు వంద శాతం మంత్రుల్ని తొలగించి.. కొత్త వారికి చాన్సివ్వాలని గతంలో నిర్ణయించారు. కసరత్తు కూడా పూర్తి చేశారు. కానీ వివిధ కారణాలతో ఆగిపోయారు. కానీ ఇప్పుడు కొంతమంది మంత్రుల్ని కొనసాగిస్తామని చెబుతున్నారు.

సామాజికవర్గాలు.. ఇతర కారణాలతో కొంత మందిని కొనసాగించవచ్చని.. మంత్రి పదవులు పోయినవారు ఫీలవ్వొద్దని జగన్ చెప్పారు. అందర్నీ తొలగించి కొత్త వారిని తీసుకుంటే.. ఎవరూ ఫీల్ అయ్యే చాన్స్ ఉండేది కాదు. అందర్నీ తీసేశారు కదా అనుకునేవారు. కానీ ఇప్పుడు కొంత మందినే తీసేస్తున్నట్లుగా చెబుతున్నారు. దీంతో వారు ఫీలయ్యే అవకాశాల ఉన్నాయి. ఆ కొంత మందిని జగన్ ఎందుకు కొనసాగిస్తున్నారనేది వైసీపీలో చర్చనీయాయంశం అవుతోంది. సీనియర్ నేతలకు పార్టీ బాధ్యతలు ఇస్తారని చెప్పినప్పటికీ.. వారు అలా అయితే తిరుగుబాటు తరహాలో పని చేసే అవకాశం ఉందని నివేదికలు అందినట్లుగా తెలుస్తోంది.

మంత్రులుగా ఉండి.. అధికారం ఉంటేనే… జిల్లాల్లో సీట్లు గెలిపించడానికి ప్రయత్నిస్తాం కానీ.. మంత్రి పదవి తీసేసి గెలుపు బాధ్యతలు ఇచ్చి.. తమ ప్లేస్‌లో అధికారం అనుభవించేవారు వేరే వారు ఉంటే.. తాము ఎలా పని చేయగలమని కొంత మంది సీనియర్లు అంతర్గత చర్చల్లో పెద్దలను నిలదీసినట్లుగా చెబుతున్నారు. ఈ కారణంగా పెద్దిరెడ్డి లాంటి వారిని కేబినెట్ నుంచి తీసేయడం ప్రస్తుత పరిస్థితుల్లో అంత మంచిది కాదని జగన్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అందుకే వెనుకడుగు వేశారని అంటున్నారు.

నిజంగా నేతల అసంతృప్తి కారణంగానే జగన్ మంత్రివర్గంలో కొంతమందిని కొనసాగించాలనుకుంటే.. అది ఖచ్చితంగా ఆయనలో వచ్చిన మార్పేనని వైసీపీ వర్గాలు లెక్కలేస్తున్నాయి. తిరుగులేనంత అధికారం చెలాయిస్తూ.. పార్టీలో ఇతరులు ఏమైనా చేస్తారేమోనని భయపడే పరిస్థితి రావడం… విచిత్రమేనని అంటున్నారు. ఇది జారిపోయిన పట్టుకు నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నారు. అది ఎంత వరకూ.. ఎలా ఉందనేది.. మంత్రివర్గ విస్తరణ జరిగిన తర్వాత తెలిసే అవకాశం ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో పోలింగ్ పర్సంటేజీ 82 ప్లస్!

ఆంధ్రప్రదేశ్‌లో ఓటరు చైతన్యం వెల్లి విరిసింది. కొత్త ఓటర్లతో పాటు యువత పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొనేందుకు ఆసక్తి చూపించడంతో పోలింగ్ ఊహించనంతగా పెరిగింది. గత ఎన్నికల్లో 79 శాతం ఈవీఎం ...

అప్పుడే ఓటమికి కారణాలు చెప్పేసిన మంత్రి..!?

సర్వేలన్నీ కూటమిదే అధికారమని తేల్చడం, పోలింగ్ శాతం పెరగడంతో వైసీపీ నేతలు అప్పుడే ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారు. కారణం ప్రభుత్వ వ్యతిరేకత కాదని, సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారని ఆరోపిస్తున్నారు. సాధారణ...

ఏపీలో ముగిసిన పోలింగ్ …పోలింగ్ పెరగడంతో వైసీపీలో టెన్షన్..?

ఏపీలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసింది. కొన్ని ప్రాంతాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. పలుచోట్ల ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. పలు జిల్లాలో వైసీపీ , టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ చోటు...

పోలింగ్ తగ్గించాలనే వైసీపీ “దాడుల ప్లాన్” పెయిల్ !

వీలైనంత వరకూ పోలింగ్ తగ్గించాలని వైసీపీ ముందుగానే ప్లాన్ చేసుకుంది. కీలకమైన నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కాక ముందే టీడీపీ ఏజెంట్లపై దాడులు చేసి వాటిని విస్తృతంగా ప్రచారం చేయాలనుకున్నారు. అనుకున్నట్లుగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close