కడప మైనార్టీ ఫ్యామిలీకి న్యాయం అందినట్లేనా..!?

కడప జిల్లా ప్రొద్దుటూరులో రెండు రోజులుగా సంచలనం సృష్టించిన మైనార్టీ ఫ్యామిలీకి చెందిన భూ కబ్జా వ్యవహారాన్ని ఆదివారం సెటిల్ చేశారు. తాను ఆత్మహత్య చేసుకుంటానని బాధితుడు కుటుంబంతో సహా సెల్ఫీ వీడియో తీసుకుని పెట్టడం దానికి మీడియా ప్రాధాన్యం ఇవ్వడంతో సీఎంవో వెంటనే స్పందించింది. ఆ భూకబ్జాకు పాలపడింది ఎవరో కాదు సీఎం బంధువు ఇరుగం తిరుపాల్ రెడ్డి అనే వ్యక్తి. దాంతో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే పట్టించుకోలేదు… వైసీపీ పోలీసులుగా మారిపోయిన వ్యవస్థలో భాగమైన సీఐ ఆ భూమిని వదులుకోకపోతే ఎన్కౌంటర్ చేస్తానని బాధితుడ్నే బెదిరించాడు. చివరికి అది వైరల్ అయింది.

సీఎం జగన్ ఈ ఘటనపై కలత చెందారు. తక్షణ చర్యలకు ఆదేశించారు. అంత వరకూ బాగానేఉంది. కానీ చర్యలంటే ఏమిటి కబ్జాలకు ప్రయత్నించిన వారిపై కేసులు పెట్టిలోపలేయాలి. సివిల్ పంచాయతీలో వేలు పెట్టి ఎన్ కౌంటర్ చేస్తానని మాఫియాలాగా బెదిరించి భూమిని లాగేసేందుకు ప్రయత్నించిన సీఐను తక్షణం పోలీసు ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయాలి. ఇలాంటి చర్యలు ఆశిస్తారు..కానీ ప్రొద్దుటూరులో ఏం జరిగింది. ఎస్పీ బాధిత కుటుంబాన్ని పిలిచి రాజీ చేశారు. మీ భూమి మీకు ఉండేలా చేస్తాం..ముఖ్యమంత్రి బాగా స్పందించారు.. ఆదుకున్నారని ప్రకటన ఇవ్వాలని తేల్చేశారు. దానికేం మహాభాగ్యం అని ఆ బాధితుడు అదే స్టేట్‌మెంట్ ఇచ్చాడు. సమస్య పరిష్కారం అయిపోయిందని పోలీసులు ప్రకటించారు.

అంటే ఈ వ్యవహారంలో కబ్జాకు గురైన భూమిని వెనక్కి ఇప్పించడంతోనే సమస్య పరిష్కారం అయింది. కానీ తప్పుడు పనులు చేసిన వారికి మాత్రం శిక్ష పడలేదు. తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న సీఐ కొండా రెడ్డిని విధుల నుంచి తప్పించినట్లుగా ప్రచారం చేశారు. కానీ రెండు రోజులు మాత్రమే ఆయనను విధుల నుంచి దూరంగా ఉండమన్నారు. ఇప్పుడు ఆయన విధుల్లో చేరిపోతారు. కానీ ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడతామని చెబితే తప్ప కదలిక రాలేదు. ఇంకెన్ని వెలుగులోకి రాని కబ్జాలు అలా జరిగాయో అంచనా వేయడం కష్టం. మహిళలపై దాడుల్లో నిందితుల్ని లైట్ తీసుకుని బాధితులకు ప్రజాధనం పరిహారం ఇచ్చి సరి పెడుతున్నట్లుగా.. ఇక్కడా సెటిల్మెంట్లు చేసి నిందితుల్ని కాపాడుతున్నారన్న విమర్శలు అందుకే వస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పిఠాపురంలో పవన్‌పై పుకార్ల కుట్రలు !

పవన్ కల్యాణ్ గెలిస్తే అసెంబ్లీలో అడుగుపెడితే తాము చూస్తూ బతకలేమని చస్తూ బతకాలని అనుకుంటున్నారేమో కానీ వైసీపీ నేతలు ప్రతి అడ్డమైన వ్యూహాన్ని పాటిస్తున్నారు. రాత్రికి రాత్రి పిఠాపురం వర్మ వైసీపీలోకి...

ఆర్కే పలుకు : జగన్‌ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కూ ఉంది !

జగన్ ను ఓడించాల్సిన అవసరం రేవంత్‌కు ఉందా ?. ముందు తెలంగాణలో పార్లమెంట్ సీట్లను గెలిపించుకోవాల్సిన అవసరం మాత్రం రేవంత్ కు ఉంది. అందుకే ఆయన కిందా మీదా పడుతున్నారు....

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close