ఫాతిమా కాలేజ్ సమస్య ఒక కొలిక్కి వచ్చినట్టేనా?

ఫాతిమా మెడికల్ కాలేజ్ సమస్య గత కొద్దిరోజులుగా మీడియాలో విరివిగా చర్చించబడ్డ సమస్య. కత కొన్నేళ్ళుగా విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న సమస్య.

ఆ మధ్య ఫాతిమా స్టూడెంట్స్, వారి తల్లిదండ్రులతో సమావేశమైన వైద్య శాఖా మంత్రి కామినేని శ్రీనివాస్ సమస్య పరిష్కారం కోసం వారి ముందు పలు ఆప్షన్లు ఉంచారు. ఆ అప్షన్లు నచ్చని ఫాతిమా విద్యార్థులు పవన్ కళ్యాణ్ ను కలిసి, మంత్రి కామినేని తమ ముందుంచిన ప్రతిపాదనలు వినిపించి, అవి తమకు సమ్మతం కాదని స్పష్టం చెసారు. ఫాతిమా విద్యార్థులు మాట్లాడుతూ , అసలు తప్పు చేసిన ఫాతిమా కాలేజీ యాజమాన్యాన్ని వదిలేసి తమను శిక్షించడమేమిటని తీవ్రంగా ప్రశ్నించారు. అయితె ఇప్పుడు ఆ సమస్య పరిష్కారం దిశగా సాగుతోంది. సీ ఎం చంద్రబాబు ప్రభుత్వం తరపు నుంచి ఒక ఆర్డినెన్స్ విడుదల చేసి, ఈ సమస్యని పరిష్కరించడానికి సిద్ద్మైనట్టు తెలుస్తోంది. కేరళ లో కన్నార్ మెడికల్ కాలేజ్ విద్యార్థులకి కూడా గతం లో ఇలాంటి సమస్యే ఎదురైతే అప్పుడు కూడా కేంద్రం నుంచి సహకారం అందలేదు. దీంతో కేరళ రాష్ట్ర ప్రభుత్వమే రంగం లోకి దిగి ఆర్డినెన్స్ విడుదల చేసింది. తద్వారా, ఆ విద్యార్థులు నేరుగా ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో చదువుకునే అవకాశం కలిగింది. ఇప్పుడు ఇదే తరహా పరిష్కారం ఎపిలోనూ చూపడానికి ప్రభుత్వం సిద్దమైంది. ఆర్డినెన్స్ కి సీఎం ఆమోదం తెలిపారని ఆరోగ్యశాఖ కార్యదర్శి పూనం మాలకొండయ్య స్వయంగా ప్రకటించడం తో ఇక ఆర్డినెన్స్ రావడం లాంఛనమేనని తెలుస్తోంది.

ఏది ఏమైనా, ఫాతిమా కాలేజ్ విద్యార్థుల సమస్య పరిష్కారం కావడం, ఆ విద్యార్థులకి, వారి తల్లిదండ్రులకి ఆనందం కలిగించే విషయమే!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close