ఆ క్లైమాక్స్… రిపీట్ అవుతోందా త్రివిక్ర‌మ్‌?

అత్తారింటికి దారేది వ‌చ్చాక‌.. తెలుగు సినిమా క్లైమాక్స్‌ల‌లో కాస్త మార్పు క‌నిపించింది. అప్ప‌టి వ‌ర‌కూ భారీ పోరాట దృశ్యంతో ఎండ్ కార్డ్ వేసేవారు. కానీ…. అత్తారింటికి దారేదిలో ప‌వ‌న్ ఎమోష‌న‌ల్ క్లైమాక్స్ చూశాక‌.. ఆ త‌ర‌హా ముగింపుల‌కు అల‌వాటు ప‌డ్డారు. అత్తారింటికి ఫార్ములా చాలా సినిమాల్లో క‌నిపించింది. ఈమ‌ధ్య దిల్ రాజు సినిమాల్లో క్లైమాక్స్‌లో ఫైటే ఉండ‌డం లేదు. డీజేలో కూడా అంతే క‌దా? ఓ కామెడీ బిట్‌తో ఎండ్ చేశాడు హ‌రీష్ శంక‌ర్‌. ఇప్పుడు మ‌ళ్లీ త్రివిక్ర‌మ్ అత్తారింటికి దారేది క్లైమాక్స్‌నే రిపీట్ చేసే ప‌నిలో ప‌డ్డాడు. ప‌వ‌న్ – త్రివిక్ర‌మ్ కాంబోలో ముచ్చ‌ట‌గా మూడో చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగ‌తి తెలిసిందే.

ప్ర‌స్తుతం క్లైమాక్స్ దృశ్యాల చిత్రీక‌ర‌ణ జ‌రుగుతోంది. సాధార‌ణంగా తెలుగు సినిమా క్లైమాక్స్ అంటే… ఓ హీరో, విల‌న్‌, వంద‌ల మంది ఫైట‌ర్లు ఉంటారు. కానీ.. ఇక్క‌డ మాత్రం వేరేలా స్కెచ్ వేశాడు త్రివిక్ర‌మ్‌. ఫైటుతో పాటు… ఎమోష‌న‌ల్ డైలాగుల‌తో ఓ సీన్ న‌డిపించి ఎండ్ కార్డ్ వేయాల‌ని డిసైడ్ అయ్యాడు. ప‌వ‌న్ భారీ ఎమోష‌న‌ల్ స్పీచ్‌తో ఈ సినిమా ముగుస్తుంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ సినిమాకి సంబంధించిన క్లైమాక్స్ తెర‌కెక్కిస్తున్నారు. స‌రిగ్గా అత్తారింటికి దారేదిలోలానే ప‌వ‌న్ క‌న్నీళ్లు పెట్టుకొంటూ.. డైలాగులు దంచి కొడుతున్నాడ‌ట‌. మ‌రి.. ఈ కొత్త క్లైమాక్స్ ఎలా ఉంటుందో, తెలుగు సినిమా ప‌తాక స‌న్నివేశాల్లో ఎలాంటి మార్పులు తీసుకొస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.