సారా కాదు సహజమరణాలేనని జగన్ సర్టిఫికెట్ !

జంగారెడ్డి గూడెంలో రెండు రోజుల్లో పద్దెనిమిది మంది ఒకే రకమైన లక్షణాలతో చనిపోవడం సహజమేనని సీఎం జగన్మోహన్ రెడ్డి తేల్చేశారు. స్వయంగా అసెంబ్లీలో ఈ ప్రకటన చేశారు. కల్తీ నాటు సారా కారణంగా చనిపోయారని మృతుల కుటుంబీకులు, టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టడంతో సీఎం జగన్ ప్రకటన చేశారు. దేశంలో ప్రతీ రోజు రెండు శాతం సహజ మరణాలు సహజమేనన్నారు. వృద్దాప్యం, అనారోగ్యం, ప్రమాదాలు.. ఇతర కారణాల వల్ల రెండు శాతం మంది చనిపోతూంటారని.. జంగారెడ్డి గూడంలో యాభై వేలకుపైగా జనాభాఉన్నారని.. వారిలో పద్దెనిమిది మంది చనిపోవడం సహజమేనన్నారు.

నాటు సారా కారణంగా చనిపోలేదన్నారు. మృతుల కుటుంబసభ్యులు చేస్తున్న ఆరోపణలపై సీఎం జగన్ స్పందించలేదు కానీ.. టీడీపీ నేతలు మాత్రం శవ రాజకీయాలుచేస్తున్నారని విమర్శించారు. అంతకు ముందు జంగారెడ్డి గూడెం ఘటనపై చర్చకు పట్టుబట్టినందుకు ఐదుగురు టీడీపీ సభ్యులను బడ్జెట్ సమావేశాల మొత్తం సస్పెండ్ చేశారు. చనిపోయిన వారిలో పదహారు మందిని కుటంబీకులు దహనం చేసేశారు. దీంతో పోస్టుమార్టంకు వీలు లేకుండా పోయింది. ఇద్దరిని మాత్రమే ఖననం చేయడంతో వారి పోస్టు మార్టం పూర్తి చేశారు. నివేదికలు రావాల్సిఉంది. అయి

ఎలాంటి విచారణలు.. అధికారుల నివేదికలు లేకుండా సీఎం జగన్ .. రోజువారీ మరణాల సగటును చూపించి.. అవన్నీ సహజమరణాలేనని తేల్చేయడం అందర్నీ విస్మయపరిచింది. మనిషి ప్రాణానికి విలువలేదన్నట్లుగా ఆయన మాట్లాడటతం.. వైసీపీసభ్యులను సైతం విస్తుపోయేలా చేసింది. మొత్తంగా జంగారెడ్డిగూడెంలో నాటు సారి ఏరులైపారుతోందని .. వైసీపీ నేతలే వ్యాపారులని స్థానికులు బహిరంగంగానే చెబుతున్నా.. ప్రభుత్వం మాత్రం.. పట్టించుకోవడానికి సిద్ధంగా లేదని తేలిపోయింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీలో ఉద్రిక్తత… రంగంలోకి కేంద్ర బలగాలు..!!

ఏపీలో పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పలు జిల్లాలో హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ తలెత్తుతుండటంతో ఈసీ సీరియస్ అయింది. పల్నాడు జిల్లాలో 144సెక్షన్ విధించాలని జిల్లా...

యాక్షన్ లోకి దిగిన హీరోయిన్స్

గ్లామర్ పాత్రలతో ప్రేక్షకులని ఫిదా చేసే హీరోయిన్స్ యాక్షన్ బరిలో దిగుతున్నారు. హీరోలకు ధీటుగా పోరాటాలు చేస్తూ యాక్షన్ చిత్రాలతో సై అంటున్నారు. ఒకరు తుపాకీ పట్టుకొని బుల్లెట్ల వర్షం కురిపిస్తే.. మరొకరు...

వైసీపీ : 2019లో కాన్ఫిడెన్స్‌కా బాప్ – ఇప్పుడు సైలెంట్

2019లో ఏపీలో ఎన్నికలు మొదటి విడతలోనే పూర్తయ్యాయి. ఎన్నికలు అయిపోయిన మరుక్షణం వైసీసీ రంగంలోకి దిగిపోయింది. అప్పటికే ఈసీ ద్వారా నియమింప చేసుకున్న ఉన్నతాధికారుల అండతో ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకున్నారు....

రూ. 21వేల కోట్లు – దోచేస్తారా ?

ఏపీ ప్రభుత్వం దగ్గగర ఇప్పుడు ఇరవై ఒక్క వేల కోట్లుకపైగానే నిధులు ఉన్నాయి . పోలింగ్ కు ముందు ప్రజలఖాతాల్లో వేయాల్సిన పధ్నాలుగు వేల కోట్లతో పాటు ఆర్బీఐ నుంచి తాజాగా తెచ్చిన...

HOT NEWS

css.php
[X] Close
[X] Close