ఆర్టీసీ కార్మికుల్ని ఉద్యోగుల్ని చేసేసిన సీఎం

ఆర్టీసీ కార్మికుల సుదీర్ఘ స్వప్నాన్ని జగన్ కొత్త దశాబ్దంలో నెరవేరుస్తున్నారు. జనవరి ఒకటో తేదీ నుంచి ఆర్టీసీ ఉద్యోగులంతా ప్రభుత్వ ఉద్యోగులుగా మారబోతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. తాము వస్తే.. విలీనం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఆ ప్రకారం.. అధికారం చేపట్టగానే..ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నిర్ణయించారు. కానీ అది సాంకేతికంగా అసాధ్యమని చెప్పడంతో.. ఉద్యోగుల్ని మాత్రం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని నిర్ణయించారు.

ఈ మేరకు చట్ట సవరణ చేశారు. రేపట్నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ఒక్క ఉద్యోగి కూడా ఉండరు. అందరూ ప్రజారవాణా అనే ప్రభుత్వ విభాగంలో ఉద్యోగులుగా ఉంటారు. జీతాలు వారికి నేరుగా ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లిస్తారు. ఫిబ్రవరి ఒకటి నుంచి ప్రభుత్వ ఖజానా నుంచే జీతాలు అందుతున్నాయి. పని మాత్రం ఆర్టీసీకి చేయాల్సి ఉంటుంది. మొత్తం 51వేల మంది వరకూ ఉద్యోగులు .. ప్రభుత్వ ఉద్యోగుల జాబితాలో చేరారు.

అయితే.. జీతాలు ప్రభుత్వ ఖాతా నుంచి ఇస్తున్నారు కానీ.. నిజంగా ప్రభుత్వ ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలపై మాత్రం.. ఇంత వరకూ ప్రభుత్వం ఏ నిర్ణయ తీసుకోలేదు. దీంతో ఉద్యోగుల్లో అసంతృప్తి కనిపిస్తోంది. అయితే.. ముందు ముందు ఈ ఇబ్బందుల్ని పరిష్కరిస్తామని ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చారు. విలీన వేడుకలను ప్రతి డిపోలోనూ.. జనవరి ఒకటో తేదీన ఘనంగా జరపాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

వైసీపీ కుట్రలకు వీరనారిలా ఎదురు నిలిచిన మహిళ..!!

ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక వ్యవస్థలన్నింటిని నిర్వీర్యం చేసింది. వ్యవస్థలను తమ చెప్పు,చేతుల్లో ఉంచుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చిందన్న విమర్శలు మూటగట్టుకుంది. దాంతో ఎన్నికలను కూడా సరైన విధంగా నిర్వహించేందుకు వైసీపీ సహకరిస్తుందా..? అనే...

రంగంలోకి కేజ్రీవాల్… బీజేపీ ఆశలపై నీళ్లు చల్లుతారా..?

మద్యం కుంభకోణంలో అరెస్ట్ అయిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఇటీవల మధ్యంతర బెయిల్ రావడంతో ఎన్నికల్లో ఆయన ప్రభావం ఎంతమేర ఉంటుందనేది చర్చనీయాంశం అవుతోంది. గతంలో ఢిల్లీలోని లోక్ సభ...

టాలీవుడ్ కి తొలి ప్రమాద హెచ్చరిక

తెలంగాణలో రెండు వారాల పాటు సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో షోలు ఆపివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో నష్టం ఎక్కువ వస్తోందని, దీంతో సినిమాల ప్రదర్శనలు ఆపాలని నిర్ణయించినట్లు నిర్వాహకులు చెబుతున్నారు....

ఏపీలో కల్లోల పరిస్థితి…అందుకే జగన్ కాముష్..?

ఓడిపోతున్నట్లు నిర్ధారణకు వచ్చారో లేదంటే, తన్నుకొని చావండి అనుకున్నారో ఏమో కాని, ఏపీలో చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి జగన్ రెడ్డి స్పందించకపోవడం విమర్శలకు తావిస్తోంది. పల్నాడులో టీడీపీ - వైసీపీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close