వైఎస్సార్ అవార్డులు భారతరత్నాల్లాంటివే : సీఎం జగన్

కేంద్ర ప్రభుత్వం భారతరత్న, పద్మ పురస్కారాలను ఇస్తోందని అలాంటివే తాము ఇవ్వాలనే సంకల్పంతో వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్‌ అవార్డులు ఇస్తున్నామని సీఎం జగన్ ప్రకటించారు. రెండు నెలల కిందట ప్రకటించిన అవార్డులను ఈ రోజు ప్రధానం చేశారు. అవార్డులు గెల్చుకున్న వారికి రూ.10 లక్షలు ఇస్తామని …రాష్ట్ర చరిత్రలోనే భేదాభిప్రాయాలు లేని అత్యంత ఉన్నత అవార్డులు ఇస్తున్నామని జగన్‌ చెప్పుకొచ్చారు. కులం, మతం, రాజకీయ పార్టీలకు అతీతంగా అవార్డుల ఎంపిక జరిగిందని సీఎం ప్రకటించారు.

సేవలను మాత్రమే పరిగణనలోకి తీసుకుని అవార్డులకు ఎంపిక చేశామని.. సామాన్యులుగా ఉండే అసమాన్యుల ప్రతిభకు పట్టం కట్టామన్నారు. కళలు, సంస్కృతికి అవార్డుల్లో పెద్దపీట వేశామని సీఎం తెలిపారు. వైఎస్ఆర్ అని ఓ నాయకుడి పేరు పెట్టి కుల, మతాలకు అతీతంగా ఇస్తున్నామని జగన్ చెప్పడమే కాస్త ఆశ్చర్యరకంగా ఉంటే ఈ అవార్డుల్ని దేశ అత్యున్నత పురస్కారాలయిన భారతరత్న, పద్మలతో పోల్చడం మరింతగా ప్రజల్ని ఆశ్చర్య పరిచింది. పైగా అవార్డుగా ఇచ్చేది వైఎస్ఆర్ విగ్రహాన్నే.

ఈ అవార్డుల్ని ప్రకటించిన తర్వాత పాలగుమ్మి సాయినాథ్ వంటి వారు తమకు ఈ అవార్డు వద్దని తిరస్కరించారు కూడా. అయనప్పటికీ ఇవి అత్యున్నత పురస్కారాలని చెప్పడం చాలా మందిని ఆశ్చర్య పరిచేదే. ఈ అవార్డుల వేడుకలకు సీఎం జగన్ తల్లి విజయమ్మ హాజరయ్యారు. ప్రమాణస్వీకారం తర్వాత ఏ అధికారిక కార్యక్రమంలోనూ కనిపించని తల్లి విజయలక్ష్మికి ఈ అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో చోటు దక్కింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close