జగన్ వ్యూహం ఫలించినట్లే ఉంది

వైకాపా ఎమ్మెల్యేలను తెదేపాలోకి తీసుకుపోతుండటంతో అప్రమత్తమయిన ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాజధాని భూముల బినామీ కొనుగోళ్ళ వ్యవహారాన్ని బయటపెట్టారు. అదే సమయంలో ముద్రగడను కూడా మళ్ళీ తెదేపా ప్రభుత్వంపైకి ఉసిగొల్పినట్లున్నారు. దానితో ఆయన కూడా ప్రభుత్వంతో యుద్ధం మొదలుపెట్టేసారు. ఒకేసారి జగన్, ముద్రగడ ఇద్దరూ కలిసి చేస్తున్న ఈ దాడితో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెదేపా ప్రభుత్వం వైకాపా ఎమ్మెల్యేల విషయంలో తాత్కాలికంగా వెనక్కి తగ్గినట్లుంది. కనుక జగన్ వ్యూహం ఫలించినట్లే కనబడింది కానీ ఈరోజే పాతపట్నం వైకాపా ఎమ్మెల్యే కలమట వెంకట రమణ తన తండ్రి మాజీ ఎమ్మెల్యే మోహన్ రావుతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఇవ్వాళ్ళ తెదేపాలో చేరిపోయారు.

ముద్రగడ పద్మనాభం ప్రభుత్వానికి మార్చి 10వరకు గడువు విధించారు. అంటే ఇంకా ఆరు రోజుల వ్యవధి ఉంది. కనుక ఈలోగా ఎవరూ పార్టీ వీడకుండా ఉండేందుకు జగన్మోహన్ రెడ్డి తెదేపా ప్రభుత్వంపై ఏదోవిధంగా ఇంకా ఒత్తిడి పెంచవచ్చును. బహుశః ఈలోగా అమరావతి ప్రాంతంలో బినామీ పేర్లతో భూములు కొన్న మరికొంత మంది తెదేపా నేతల పేర్లు సాక్షి మీడియా బయటపెడుతుందేమో?

రేపటి నుండి అసెంబ్లీ సమావేశాలు కూడా మొదలవుతాయి కనుక వాటిని దీని కోసం ఉపయోగించుకొంటూ జగన్, అతని పార్టీ ఎమ్మెల్యేలు చెలరేగిపోవచ్చును. స్పీకర్ కోడెల శివప్రసాద రావుపై, తెదేపా ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెడతామని ఎలాగూ ముందే ప్రకటించారు కనుక దానితో కూడా సభలో రభస చేయవచ్చును. తెదేపా ప్రభుత్వం కేవలం వైకాపా నుండే కాకుండా మిత్రపక్షమయిన బీజేపీతో కూడా చాలా ఇబ్బంది పడుతోంది. కనుక ఈ ఒత్తిళ్ళ కారణంగా తెదేపా వెనక్కి తగ్గినట్లయితే జగన్ వ్యూహం పూర్తిగా ఫలించినట్లే చెప్పవచ్చును.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close