“సిన్హా” పేరుతో మళ్లీ టీ కాంగ్రెస్ వర్గ పోరాటం !

తెలంగాణ కాంగ్రెస్‌లో ఏదో ఓ చిచ్చు పెట్టకపోతే జగ్గారెడ్డికి మనసు ప్రశాంతంగా ఉండదు. తాజాగా విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు మనం ఎందుకు మద్దతు ప్రకటించలేదని ఆయన మీడియా ముందు కాంగ్రెస్ పార్టీపై చెలరేగిపోయారు. అయితే ఈ తప్పు రేవంత్ రెడ్డి మీద వేయకుండా వ్యూహాత్మకంగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కపై వేశారు. ఆయనే తప్పు చేశారని ఓ లేఖ కూడా ిడుదల చేశారు. కానీ జగ్గారెడ్డి రాజకీయం తెలుసుకోలేనంత అమాయకంగా కాంగ్రెస్ నేతలు లేరు.

చివరి క్షణంలో యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించిన టీఆర్ఎస్ విషయంలో కాంగ్రెస్ అసంతృప్తిగా ఉంది. కేసీఆర్ తో కలిసిన తరువాత తమను కలుస్తున్నారని.. తాము అందుకు అంగీకరించేది లేదని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇదే విషయాన్ని తమ పార్టీ జాతీయ నాయకత్వానికి స్పష్టం చేశామని రేవంత్ వెల్లడించారు. ఈ విషయం పార్టీలో అందరికీ తెలుసు. యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించినా తెలంగాణలో కలవకుండా ఉండేలా నిర్ణయం తీసుకుంది రేవంత్ రెడ్డేనని జగ్గారెడ్డికి తెలుసని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

జగ్గారెడ్డి అసంతృప్తి అంతా రేవంత్ రెడ్డిపైనేనని.. అయితే గతంలో రేవంత్ పై పలుమార్లు విమర్శలు చేసిన అంశం మిస్ ఫైర్ కావడంతో ఇప్పుడు మల్లు భట్టి విక్రమార్క పేరు చెప్పి రేవంత్‌ను టార్గెట్ చేస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయినా జగ్గారెడ్డి మాత్రం భట్టి భుజాలపై నుంచి మరోసారి రేవంత్ రెడ్డిపై గురి పెట్టారు. నిజానికి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించడంలో ఆయనను ఇదే రోజు తెలంగాణకు రప్పించడంలో టీఆర్ఎస్ రాజకీయ వ్యూహాలు ఉన్నాయి. ఆ వ్యూహంలో చిక్కుకుపోవడం ఇష్టం లేక కాంగ్రెస్ నేతలు కూడా సిన్హాను పట్టించుకోకూడదనుకున్నారు. కానీ జగ్గారెడ్డి మాత్రం ఇదే సందు అనుకుని తన రాజకీయం తాను ప్రారంభించారు .

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ హిట్ ల‌వ్ స్టోరీకి సీక్వెల్ కూడా!

ఈమ‌ధ్య సీక్వెల్ క‌థ‌ల జోరు ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. అయితే యాక్ష‌న్‌, క్రైమ్‌, థ్రిల్ల‌ర్‌, హార‌ర్ చిత్రాల‌కు సీక్వెల్ చూశాం. ఇప్పుడు ల‌వ్ స్టోరీల్లోనూ ఆ ట్రెండ్ మొద‌లైపోయింది. ఇటీవ‌ల మ‌ల‌యాళంలో సూప‌ర్ హిట్...

చంద్రబాబు వస్తే : జగన్

చంద్రబాబు రాబోతున్నాడని.. టీడీపీ కూటమి గెలవబోతోందని జగన్ కు కూడా అర్థమైపోయింది. ఆయన ప్రసంగాలు పూర్తిగా చంద్రబాబు వస్తే ఏదో జరిగిపోతుందని భయపెట్టడానికే పరిమితవుతున్నాయి . కాకినాడలో జరిగిన సభలో .. తోలుకొచ్చిన...

ఏపీలో పోస్టల్ బ్యాలెట్‌పై కుట్రలు – ఈసీ పట్టించుకోదా ?

ఏపీలో ఉద్యోగులు ప్రభుత్వంపై మండిపోతున్నారు. ముఖ్యంగా ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. అందుకే వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉంటారు. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు.. ఆయన జీ హూజూర్ బ్యాచ్‌కు బాగా...
video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close