పుంజుకోని 99 టీవీ, గుర్రుగా ఉన్న జనసైనికులు

పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ మీద, పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం మీద కొన్ని చానళ్ళలో ఆ మధ్య అదేపనిగా నెగటివ్ ప్రోగ్రామ్స్ వేసి, ఆయన పార్టీని దెబ్బతీయడానికి, ఆయన వ్యక్తిత్వాన్ని హననం చేయడానికి ప్రయత్నించడంతో పవన్ కళ్యాణ్ మీడియా పై తిరగబడ్డ విషయం తెలిసిందే. తన తల్లిని బూతులు తిట్టించారని ఆరోపిస్తూ పవన్ కళ్యాణ్ మీడియాపై ఎదురుదాడికి సిద్ధపడడం కూడా తెలిసిందే. అయితే రాజకీయ పార్టీకి మీడియా అవసరం ఎంత ఉందో ప్రజారాజ్యం సమయంలోనే తేటతెల్లం కావడంతో, తన పార్టీకి మద్దతుగా కొన్ని చానళ్లు ఉండేలా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసుకున్నాడు. ఆ క్రమంలో జనసేన నేత ,మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ 99టీవీ చేజిక్కించుకోవడంతో జనసేన అభిమానులు తమకంటూ ఒక ఛానల్ ఉందని సంబరపడిపోయారు. కానీ ఇప్పుడు అదే అభిమానులు 99 టీవీ ఛానల్ పైన కంప్లైంట్ లు చేస్తున్నారు.

పుంజుకో లేకపోయిన 99టీవీ:

చానల్ ప్రారంభించి కొద్ది రోజులే అయింది కాబట్టి బాలారిష్టాలు ఉండడం సహజమే. అయితే మరో ఆరేడు నెలల్లో ఎన్నికలు పెట్టుకుని ఇప్పటికీ ఆ అరిష్టాలను దాటి ముందుకు వెళ్లకపోవడంతో అభిమానుల్లో చానల్ పై ఒక విధమైన అసంతృప్తి కనిపిస్తోంది. ఒక ఇరవై వార్తా చానల్ ల దాకా తెలుగులో ఉంటే, 99టీవీ స్థానం 18 లేదా 19 లో ఉంటోంది. మొదటి స్థానంలో ఉన్న టీవీ 9 కి 70 పాయింట్ల దాకా రేటింగ్ ఉంటే, 99టీవీ 4 పాయింట్లతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది.

అభిమానుల కంప్లైంట్లు ఏమిటి?

మొట్టమొదటి కంప్లైంట్ , ఇప్పటికీ చాలా చోట్ల ఈ ఛానల్ రావడం లేదు. హైదరాబాద్ నగరంలోనే బ్రైట్ వే లాంటి ఆపరేటర్లు ఈ ఛానల్ ని బ్లాక్ చేసి చాలా కాలం అయింది. కొంతమంది అభిమానులు ఆపరేటర్లను ఈ విషయమై ప్రశ్నిస్తే, ఛానల్ నుంచి వాళ్లకు బకాయిలు ఇంకా రావలసి ఉందని వారు చెబుతున్నారు. ఇదే సమస్య మిగతా చాలా ఆపరేటర్ల తో కూడా ఉంది. అన్నేసి కోట్లు పెట్టి ఛానల్ కొనుక్కున్న వాళ్ళు, చిన్న చిన్న బకాయిలు తీర్చడానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నారంటూ అభిమానులు 99టీవీ దృష్టికి కూడా తీసుకు వెళ్తున్నారు.

రెండవ కంప్లైంట్, ఇప్పటికీ ఈ ఛానల్ డిటిహెచ్ లో రావడం లేదు. ఈమధ్య వీడియోకాన్ లో వస్తున్నప్పటికీ, తెలుగు రాష్ట్రాలలో ఎక్కువమంది ఉపయోగించే ఆపరేటర్ల లో ఈ ఛానల్ ఇప్పటికీ రావడం లేదు. అసలు ప్రసారాలు రాకపోతే టి ఆర్ పి లు మాత్రం ఎలా వస్తాయి అని జనసేన అభిమానులు ప్రశ్నిస్తున్నారు.

అలాగే ఛానల్ లో వచ్చే ప్రోగ్రాం ల నాణ్యత విషయంలో కూడా కంప్లైంట్ లు ఉన్నాయి. వీడియో క్వాలిటీ లాంటి విషయాల్లో గత రెండు నెలల్లో చాలా మెరుగుదల కనిపించినప్పటికీ, ప్రోగ్రామ్స్ జనాకర్షకంగా లేకపోవడం, జనసేన అభిమానులను తప్ప మిగిలిన తటస్థ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ప్రోగ్రామ్స్ డిజైన్ చేయకపోవడం వంటి విషయాల్లో అభిమానులు 99టీవీ పై గుర్రుగా ఉన్నారు.

ఛానల్ యాజమాన్యం ఏమంటున్నారు:

ఛానల్ లో పనిచేసే పై స్థాయి సిబ్బంది, త్వరలోనే ఛానల్ యొక్క ప్రసారాలు అన్ని డిటిహెచ్ లలో వస్తాయని రెండు నెలలుగా అభిమానులను ఊరిస్తున్నారు. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కారణంగా ఇంతకాలం ఆలస్యమైందని సర్ది చెబుతున్నారు.

అలాగే వీడియో క్వాలిటీ విషయంలో కూడా ఛానల్ కు కొంత సమస్య ఉంది. ఈ ఛానల్ యొక్క శాటిలైట్ లింక్ నోయిడా కు వెళ్లి నోయిడా నుండి రీ-కాస్ట్ అవ్వాల్సి రావడంతో క్వాలిటీ లోపిస్తోందని యాజమాన్యం అంగీకరిస్తున్నారు. అయితే ఈ టెక్నికల్ ప్రాబ్లం పరిష్కరించడానికి ఇదివరకే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి అని, త్వరలోనే ఈ పరిష్కారం అవుతుందని వివరణ ఇస్తున్నారు.

అలాగే, అన్ని ఆపరేటర్లలో ప్రసారాలు త్వరలో వస్తాయని అభిమానులకి సర్ది చెబుతున్నారు

మొత్తం మీద:

మొత్తం మీద ఈ ఛానల్ విషయంలో ఇప్పటికీ అభిమానులకయితే కాస్తంత అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే. గట్టిగా మాట్లాడితే, ఇప్పటికీ ఈ ఛానల్ ని టీవీ లో చూసే వారి కంటే యూట్యూబ్ లో చూసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అదేవిధంగా చానల్ అధినేత తోట చంద్రశేఖర్ పవన్ కళ్యాణ్ కి అత్యంత ఆప్తుడు. పైగా పార్టీలో అత్యంత కీలకమైన పదవి లో ఆయన ఉన్నారు. మాజీ ఐఏఎస్ కూడా అయిన ఆయనకు, ఎన్నికలలోపు ఛానల్ ని ప్రజలందరిలో కి తీసుకెళ్ల లేకపోతే అది ఆయన సొంత వైఫల్యంగా అటు పవన్ కళ్యాణ్ కానీ ఇటు పార్టీ అభిమానులు కానీ భావించే అవకాశం ఉందని ఆయనకు తెలిసే ఉంటుంది. మరి ఇప్పటికైనా ఈ చానల్ ను మరింత దూకుడుగా జనాల్లోకి తీసుకెళ్లే విషయంలో ఆయన ఎంతవరకు సఫలీకృతం అవుతాడనేది వేచిచూడాల్సి ఉంది

– జురాన్ (@CriticZuran)

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కేకేను తిట్టి పంపించిన కేసీఆర్

రాజ్యసభ ఎంపీ కేకే, ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి శనివారం కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. తనను పార్టీలో చేర్చుకుని రెండు సార్లు రాజ్యసభ సీటు ఇచ్చిన కేసీఆర్ కు ఓ...

అవినాష్ రెడ్డికి ఎన్నికల ముందే బెయిల్ రద్దు గండం ?

అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని అప్రూవర్ గా మారిన దస్తగిరికి పిటిషన్ వేసే హక్కు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆయన వేసిన పిటిషన్‌పై విచారణ జరగనుంది. ఏప్రిల్...

‘ఆడు జీవితం’ రివ్యూ: ఎడారి పాలైన బ్రతుకుల వ్యధ

ఫారిన్ చిత్రాలతో పోల్చుకుంటే భారతీయ చిత్రాలలో సర్వైవల్ థ్రిల్లర్స్ తక్కువే. అయితే ఈ మధ్య కాలంలో మలయాళ పరిశ్రమ ఈ జోనర్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. '2018' చిత్రం ఆస్కార్ నామినేషన్స్...

అనపర్తిలో ఆందోళన… నల్లమిల్లి దారెటు..?

అవును ప్రచారమే నిజమైంది. అనపర్తి సీటు టీడీపీ నుంచి బీజేపీ ఖాతాలోకి వెళ్ళిపోయింది. పొత్తులో భాగంగా బీజేపీ నేత ములగపాటి శివ కృష్ణంరాజుకి కేటాయించారు. దీంతో టీడీపీ టికెట్ ఆశించిన మాజీ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close