“ఆ ప్రశ్న” అడిగితే అసహనానికి గురవుతున్న జనసేన !

మంత్రి అంబటి రాంబాబుపై జనసేన పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు. ఆయనపై రకరకాల పద ప్రయోగాలు చేస్తూ మండి పడుతున్నారు. అంబటి రాంబాబును బపూన్‌ను చేస్తూ.. ఆయన ఫోటోను మార్ఫింగ్ చేసి మరీ … నాగేంద్రబాబు ఓ ట్వీట్ చేశారు. ” బాబూ… ఓ రాంబాబు ఎన్నిస్లారు ఒకే ప్రశ్న అడుగుతావయ్యా అంటూ వ్యాఖ్యానించారు. జంబో సర్కస్ బఫూన్లు అడిగే క్లారిఫికేషన్స్ కి, వైసీపీ సర్కస్ లో నీలాంటి బఫూన్ గాళ్లు అడిగే క్లారిఫికేషన్స్ కు సమాధానం చెప్పే ఓపిక, తీరిక తమ జనసైనికులకు లేదని, తమ ప్రెసిడెంట్ కు అంతకన్నా లేద”ని నాగబాబు స్పష్టం చేశారు.

అంబటి రాంబాబు వ్యాఖ్యలపై నటుడు, నిర్మాత, పవన్ వీరాభిమాని బండ్ల గణేశ్ స్పందించారు. “అలాగే రంభల రాంబాబు గారు… మా సారు త్వరలో మీకు సమాధానం చెబుతారు” అంటూ బదులిచ్చారు. జననసైనికులు కూడా అంబటి రాంబాబుపై విరుచుకుపడుతున్నారు. తీవ్రమైన విమర్శలతో కామెంట్లు పెడుతున్నారు. దీనంతటికి కారణం.. మంత్రి అంబటి రాంబాబు చేసిన ఓ ట్వీటే. మంగళగిరి పార్టీ కార్యాలయంలో స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొన్న అనంతరం ప్రసంగించిన పవన్ కల్యాణ్ ఓట్లు చీలనివ్వబోమని వైసీపీని గెలవనివ్వబోమని ప్రకటించారు. దీనిపై స్పందించిన అంబటి రాంబాబు కాటన్ దుస్తుల చాలెంజ్ లు ఆపి, 175 సీట్లకి పోటీచేస్తున్నారా లేదా అనేది స్వాతంత్ర్య దినోత్సవం రోజైనా ప్రకటించండి అంటూ ట్వీట్ చేశారు.

అయితే సమయం సందర్భం లేకుండా జనసేన రాజకీయ వ్యూహాలపై ఎన్ని సార్లు చెప్పినా ఒకే రకమైన విమర్శలు చేస్తూండటంతో జనసేన వర్గాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. సోషల్ మీడియాలో అంబటి రాంబాబుపై విరుచుకుపడుతున్నారు. పవన్ కల్యాణ్ చాలా స్పష్టంగా తన రాజకీయ విధానాన్ని ప్రకటించారు. అయితే ఒకటే అదే పనిగా అడుగుతూ .. జనసేన సహనాన్ని వైసీపీ నేతలు పరీక్షిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

సంక్షేమ ప‌థ‌కాల బిస్కెట్లు అయిపోయాయ్‌!

https://www.youtube.com/watch?v=C4ZKy1Gi1nQ&t=2s వెండి తెర‌పై మ‌రో పొలిటిక‌ల్ డ్రామా వ‌స్తోంది. అదే 'ప్ర‌తినిధి 2'. మీడియాలో పాపుల‌ర్ అయిన‌ టీవీ 5 మూర్తి ద‌ర్శ‌కుడు కావ‌డం, నారా రోహిత్ హీరోగా న‌టించ‌డం, అన్నింటికంటే 'ప్ర‌తినిధి' ఫ్రాంచైజీ...

రేవంత్ రెడ్డి యార్క‌ర్… ప్ర‌తిప‌క్షాలు క్లీన్ బౌల్డ్ అయిన‌ట్లేనా?

గ‌త కొంత‌కాలంగా బీఆర్ఎస్ రైతుల చుట్టూ రాజకీయం మొద‌లుపెట్టింది. పంట ఎండిపోతుంద‌ని, సాగుకు విద్యుత్ అంద‌టం లేద‌ని, ధాన్యం కొనుగోలు ఏమైంద‌ని, రుణమాఫీపై మౌనం ఎందుకు అంటూ నేత‌లంతా మూకుమ్మ‌డిగా రేవంత్ స‌ర్కారుపై...

‘మై డియర్ దొంగ’ రివ్యూ: స‌హ‌నం దొంగిలించేశాడు

అభినవ్ గోమఠం అంటే నవ్విస్తాడనే నమ్మకం ఏర్పడింది. ఒకవైపు క్యారెక్టర్ రోల్స్ చేస్తూనే మెయిన్ లీడ్ గా కూడా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడాయన టైటిల్ రోల్ లో 'మై డియర్ దొంగ' సినిమా...

4 చోట్ల టీడీపీ అభ్యర్థుల మార్పు ?

తెలుగుదేశం పార్టీ నలుగురు అభ్యర్థులను మార్చాలని నిర్ణయించుకుంది. నరసాపురం సిట్టింగ్ ఎంపీ అయిన కనుమూరు రఘురామకృష్ణరాజు ఉండి అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దింపడం దాదాపు ఖాయమే. మంతెన రామరాజుకు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close