రూ.20వేల కోట్ల కరోనా ప్యాకేజీ..! కేరళ ఎప్పుడూ స్పెషలే..!

కరోనా వైరస్.. లాక్ డౌన్ కారణంగా ఆర్థికంగా చితికిపోతున్న ప్రజలను ఆదుకోవడానికి కేరళ ప్రభుత్వం రూ. ఇరవై వేల కోట్ల రూపాయలతో ప్యాకేజీ ప్రకటించింది. వీటిని వ్యవసాయంతో పాటు చిరు వ్యాపారుల కోసం ఎక్కువగా వినియోగిస్తారు. ఇక అందరికీ ఆహారం, ఉపాధి, ఫ్రీ వ్యాక్సినేషన్ కోసం కూడా విడిగా నిధులు కేటాయించారు. పద్దెనిమిదేళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వడానికి పదిహేను వందల కోట్లను కేరళ సర్కార్ మంజూరు చేసింది. ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్న వారి కోసం రూ.8,990 కోట్లు, అవసరమైన వారికి లోన్లు, వడ్డీ రాయితీల కోసం రూ.8,300 కోట్లు కేటాయించారు. మొదటి రెండు దశల్లో ప్రభుత్వం ముందు చూపుతో వ్యవహరించి… వీలైనంత ప్రాణ నష్టం తగ్గించింది.

ఇప్పుడు మూడో దశకు కూడా ముందస్తుగా సన్నాహాలు చేస్తోంది. ప్రతి తాలుకా, జిల్లా, జనరల్ హాస్పిటళ్లల్లో 10 బెడ్లతో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటుకు రూ.636కోట్లు కేటాయించారు. కరోనాను ఎదుర్కోవడం అంటే.. ప్రకటనల్లో కాకుండా… గ్రౌండ్‌లో చేసిచూపిస్తున్న ప్రభుత్వంగా కేరళకు మంచి పేరు ఉంది. తొలి దశలో..కరోనా వ్యాప్తి కారణంగా… ముందూ వెనుకా చూసుకోకుండా పెట్టినలాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా వలస కార్మికులు ఇబ్బంది పడ్డారేమో కానీ.. కేరళలో మాత్రం ఎలాంటి ఇబ్బందికలగలేదు. కమ్యూనిటి కిచెన్లు పెట్టి అందరి ఆకలి తీర్చారు. రెండో వేవ్‌లోనూ ఆ ఒరఒడి కొనసాగించారు.

పెద్ద ఎత్తున కేసులు నమోదయినప్పటికీ.. వ్యాక్సిన్ల దగ్గర్నుంచి ఏ విషయంలోనూ లోపాలకు తావివ్వలేదు. దేశం మొత్తం ఆక్సిజన్ కొరతతో అల్లాడితే… కేరళ మాత్రం పొరుగురాష్ట్రాలకు ఆక్సిజన్ అందించింది. ఇప్పుడు ప్రజల్ని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేందుకు నేరుగా నగదు బదిలీ కన్నా.. మళ్లీ వారి వ్యాపారాలు పుంజుకునేలా చేయడానికి పక్కా ప్రణాళికతో వెళ్తోంది.అందుకే దేశంలో… కేరళ ఎప్పుడూప్రత్యేకంగానే కనిపిస్తూ ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఏపీకి వెళ్లి ఓట్లేయ్య‌డ‌మే ప‌వ‌న్ కు ఫ్యాన్స్ చేసే సేవ‌!

ఏపీలో రాజ‌కీయం రోజు రోజుకీ వేడెక్కుతోంది. టీడీపీ, జ‌న‌సేన‌, భాజాపా ఓ కూట‌మిలా ఏర్ప‌డి, జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఏపీలో కూట‌మి మ‌ద్ద‌తు రోజురోజుకీ పెరుగుతోంది. సినిమా ప‌రిశ్ర‌మ నుంచి కూడా...
video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close