రేవంత్‌పై ఆయన మిత్రుడు నమ్మకం కోల్పోయాడా?

మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి చివరికి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. ఆయన బండి సంజయ్‌తో సమావేశం అయ్యారు. పధ్నాలుగో తేదీన అమిత్ షా అధ్యక్షతన జరగనున్న బండి సంజయ్ పాదయాత్ర ముగింపుసభలో ఆయన బీజేపీలో చేరవచ్చన్న ప్రచారం జరుగుతోంది. దీన్ని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఖండించలేదు. లాగని ధృవీకరించలేదు. బీజేపీ వర్గాలు మాత్రం ఆయన తమ పార్టీలో చేరడం ఖాయమని చెబుతున్నాయి.

కొండా విశ్వేశ్వరర్ రెడ్డి టీఆర్ఎస్ తరపున చేవెళ్ల నుంచి ఎంపీగా గెలిచారు. ఘనమైన కుటుంబచరిత్ర ఉన్న ఆయన టీఆర్ఎస్‌లో ఇమడలేకపోయారు. తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి గత ఎన్నికల్లో చేవెళ్ల నుంచే పోటీ చేశారు. కానీ స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు.. ఎవరూ టీఆర్ఎస్‌పై పోరాడే పరిస్థితి లేకపోవడంతో ఆయన కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడంలో రేవంత్ రెడ్డిది కీలక పాత్ర. తర్వాత రేవంత్ రెడ్డి టీ పీసీసీ చీఫ్ కావడంతో ఆయన మళ్లీ కాంగ్రెస్‌లో చేరవచ్చన్న ప్రచారం జరిగింది. రేవంత్ రెడ్డి కూడా వెళ్లి ఆయనతో చర్చలు జరిపారు. కొండా సానుకూలంగా స్పందించారు కానీ పార్టీలో చేరుతానని ప్రకటించలేదు.

తండ్రి, కొడుకుల్ని అధికారం నుంచి దూరం చేయాలని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెబుతంటారు. ఒక వేళ తాను ఏదైనా పార్టీలో చేరితే ఆ పార్టీ వెళ్లి టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంటే తన పరిస్థితి ఏమిటని ఆయన వాదన. విచిత్రంగా అటు బీజేపీతో.. ఇటు కాంగ్రెస్‌తో టీఆర్‌ఎస్ పొత్తు ఊహాగానాలు రావడంతో ఆయన ఎటూ తేల్చుకోలేకపోయారు. ఇప్పుడు పీకే ఎఫెక్ట్‌తో ఎన్నికల ముందో.. తర్వాతో టీఆర్ఎస్ చేరేది కాంగ్రెస్ గూటికేనని అనుకుంటున్నారేమో కానీ బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్లుగా తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close