విష్ణు ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీ: భ‌క్త‌క‌న్న‌ప్పపై పుస్త‌కం

రాజ‌మౌళి మెగాఫోన్ ప‌ట్టాక‌, మేకింగ్ స్టైలే కాదు, ప్ర‌మోష‌న్ స్ట్రాట‌జీలు కూడా పూర్తిగా మారిపోయాయి. `బాహుబ‌లి`, `ఆర్‌.ఆర్‌.ఆర్‌` కోసం జ‌క్క‌న్న వేసిన ప‌బ్లిసిటీ ఎత్తులకు బాలీవుడ్ మేధావులు కూడా చిత్త‌యిపోయారు. ఓ హాలీవుడ్ సినిమాని మార్కెటింగ్ చేసిన స్థాయిలో త‌న చిత్రాన్ని జ‌నంమ‌ధ్య‌లోకి తీసుకెళ్లాడు రాజ‌మౌళి. ఓ సినిమాకు ఇలాక్కూడా ప‌బ్లిసిటీ చేయొచ్చా? అని అంతా ఆశ్చ‌ర్య‌పోయారు. ఇప్పుడు ఆ అడుగుజాడ‌ల్లోనే మిగిలిన వాళ్లు న‌డుస్తున్నారు. మంచు విష్ణు కూడా ప్ర‌మోష‌న్ ప‌రంగా రాజ‌మౌళినే ఫాలో అవుతున్నాడు.

విష్ణు త‌న కెరీర్‌లోనే ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న చిత్రం.. `క‌న్న‌ప్ప‌`. ఇప్ప‌టికే ఈసినిమాని స్టార్ల‌తో నింపేసి, ఫోక‌స్ పెంచాడు. ప్ర‌మోష‌న్స్ కూడా వినూత్నంగా చేసేందుకు రంగం సిద్ధం చేసుకొంటున్నాడు. `క‌న్న‌ప్ప‌` పై ఓ పుస్త‌కాన్ని ప్రింట్ చేయించాడు విష్ణు. 16 పేజీల గ‌ల ఈ ఫ‌స్ట్ వాల్యూమ్‌లో భ‌క్త కన్న‌ప్ప‌కు సంబంధించిన అన్ని విష‌యాల్నీ పొందుప‌రిచారు. ఈ పుస్త‌కాన్ని అన్ని భాష‌ల్లోనూ అనువ‌దించి, స్థానికంగా క‌న్న‌ప్ప విశేషాలు తెలిసేలా చేస్తారు. అలా.. ఈ సినిమాకు వ‌చ్చేవాళ్ల‌కు క‌న్న‌ప్ప‌పై ఓ స్ప‌ష్ట‌మైన అవ‌గాహ‌న వ‌స్తుంది. ఇదీ…. విష్ణు స్ట్రాట‌జీ. దీంతో పాటుగా క‌న్న‌ప్ప‌లోని న‌టీన‌టుల‌కు సంబంధించిన యానిమేష‌న్ చిత్రాలు కూడా రూపొందించాల‌ని ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రేవంత్‌కు ఢిల్లీ పోలీసుల నోటీసులు – తెలంగాణపై దాడే !

ఓ సోషల్ మీడియా పోస్టు షేర్ చేసినందుకు ఢిల్లీ నుంచి వచ్చి పోలీసులు నోటీసులు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి.. తెలంగాణపై దాడిగా పేర్కొన్నారు. బీజేపీ విధానాలను ప్రశ్నించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రికి,...

దేవగౌడ మనవడి రాసలీలలు – బీజేపీకి తలనొప్పి !

కర్ణాటకలో రాజకీయ నేతల రాసలీలల ఎపిసోడ్ లేకుండా ఎన్నికలు జరగవు. గతంలో అసెంబ్లీలోనే ఎమ్మెల్యేలు బ్లూ ఫిల్మ్‌ చూస్తూ దొరికిపోయారు. తర్వాత మంత్రిగా ఉండి రమేష్ జార్కిహోళి అనే నేత చేసిన...

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ

వైఎస్ జగన్ సర్కార్ ఇంప్లిమెంట్ చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఏపీ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. ఏ గ్రామంలో చూసినా దీనిపైనే చర్చ. పట్టణ ప్రాంతాల్లో రాజకీయ అవగాహన ఉన్న...

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close