ముందే చేతులెత్తేసిన మంత్రి ధర్మాన

ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పదే పదే చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తప్పించకోవడానికి బహిరంగ ప్రకటనలు చేయడం తప్ప మరో మార్గం లేదనుకుంటున్నారేమో కానీ.. తాను పోటీ చేయనని సీఎం జగన్ రెడ్డికి చెప్పేశానని ..కానీ జగన్ రెడ్డి మాత్రం పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని అంటున్నారు. ప్రస్తుత రాజకీయాలంటే తనకు విసుగెత్తిపోయిందని ధర్మాన చెబుతున్నారు.

కానీ ఆయనకు పరిస్థితి అర్థమయింది కాబట్టి తప్పించుకునేందుకు దగ్గరి దారి వెదుక్కుంటున్నారన్నసెటైర్లు వినిపిస్తున్నాయి. ధర్మాన ఏడాది కిందటే తాను పోటీ చేయబోవడం లేదని ప్రకటించారు. కానీ ఆయన స్థానంలో అభ్యర్థిని వెదుక్కోవడం కష్టమవుతుందో లేకపోతే.. అంత తేలికగా ఎందుకు వదిలి పెడతానని జగన్ రెడ్డి అనుకున్నారో కానీ పోటీ చేసి తీరాల్సిందేనని చెప్పారంటున్నారు. అయితే తనకు బదలుగా తన కుమారుడికి చాన్సివ్వాలని కోరారని.. దానికి జగన్ అంగీకరించలేదని అంటున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది పరిస్థితిపై మరింతగా క్లారిటీకి వస్తోంది.

జగన్ రెడ్డి తాను సీటు వద్దంటున్నా సరే నిలబడమంటున్నారని రేపు ఓడిపోతే తనది బాధ్యత కాదని ఆయన ఇప్పుడు క్లెయిమ్ చేసుకుంటున్నట్లుగా ప్రకటనలు ఉంటున్నాయి. ధర్మానకు మంత్రి పదవి రానంత వరకూ అసంతృప్తి స్వరాలు వినిపించారు. శ్రీకాకుళం జిల్లా విభజనపైనా వ్యతిరేకంగా స్పందించారు. బిల్లులు రావడం లేదన్నారు. అయినా మంత్రి పదవి ఇచ్చేసరికి అన్నింటినీ అణిచివేసుకున్నారు.

గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో రాజధాని పేరుతో రెచ్చగొట్టేందుకు చాలా ప్రయత్నించారు. కానీ ప్రజలు మాత్రం… అంత అమాయకులం కాదులే అన్నట్లుగా ఉండటం.. ప్రజాచైతన్యం కనిపించడంతో ఇక ఆటలు సాగవని.. డిసైడయినట్లుగా కనిపిస్తోంది. మరి జగన్ బతిమాలి ధర్మాననే పోటీ చేయిస్తారా లేకపోతే వేరే వ్యక్తిని బరిలోకి తెస్తారా అన్నది చూడాల్సి ఉంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close