జూలైలో ఏపీకి మోదీ – పొలిటికల్ సీన్‌ క్లారిటీ వచ్చేస్తుందా ?

ముందస్తు ఎన్నికలు ప్రచారం జోరుగా సాగుతూండగానే ఏపీలో రాజకీయ పార్టీ ల కార్యకలాపాలు కూడా పెరుగుతున్నాయి. గత మూడేళ్లలో తిరుమల పర్యటనకు తప్ప ఎలాంటి పర్యటనలకూ రాని ప్రధాని మోదీ తొలి సారి జూలైలో ఏపీ పర్యటనకు రానున్నారు. భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను నిర్వహించనున్నారు. అందులో పాల్గొనేలా ప్రధాని షెడ్యూల్ ఖరారయింది. ప్రధాని ఇలాంటి వేడుకలకు వస్తున్నారంటే బహిరంగసభను ఉద్దేశించి ప్రసించడం కూడా ఖాయమే.

ప్రధాని పర్యటనలో ఏపీ రాజకీయాల్లో బీజేపీ పాత్రపై ఓ క్లారిటీ వస్తుందన్న అభిప్రాయం వినిపిస్తోంది. వైసీపీ పనితీరును ఆయన తీవ్రంగా విమర్శిస్తే.. ఆ పార్టీకి స్నేహానికి గుడ్ బై చెప్పినట్లేనని అనుకోవచ్చు. వైసీపీ పనితీరుపై ప్రశంసలు కురిపించకపోయినా.. కనీసం సైలెంట్‌గా ఉన్నా.. లోపాయికారీగా జగన్‌తో బీజేపీ సంబంధాలు కొనసాగించడానికి సిద్ధపడినట్లుగా భావించవచ్చు. అదే సమయంలో పవన్ కల్యాణ్ విషయంలో ఎలా వ్యవహరిస్తారన్నది కూడా స్పష్టమయ్యే అవకాశం ఉంది.

ప్రధాని పర్యటనకు పవన్ కల్యాణ్‌ను కూడా ఆహ్వానించి సముచిత ప్రాధాన్యం ఇస్తే ఓట్లు చీలకూడదన్న పవన్ భావజాలంతో ఏకీభవించినట్లు అవుతుంది. అదేమీ కాకుండా అది రాజకీయ పర్యటన కాదని అందుకే ఆయనను పిలవడం లేదనే కారణాలు చెబితే మాత్రం… బీజేపీనే ఆయనను దూరం పెడుతుందని అనుకోవచ్చు. మొత్తంగా ప్రధాని మోదీ పర్యటనతో ఏపీలో రాజకీయ సమీకరణాలు ఓ రూపానికి వస్తాయన్న అభిప్రాయం గట్టిగా వినిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close