ఊపిరికి నాగార్జున స్పెషల్ ఇంట్రెస్ట్..!

పివిపి బ్యానర్ లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నిర్మించబడుతున్న సినిమా ఊపిరి. హాలీవుడ్ ఇన్ టచబుల్స్ సినిమాకు అఫిషియల్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాలో కింగ్ నాగార్జున, కార్తి స్నేహితులుగా నటిస్తుండగా.. తమన్నా కథానాయికగా చేస్తుంది. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న ఈ సినిమా మీద పూర్తి నమ్మకంతో ఉన్నాడట నాగార్జున.

ఈ సంవత్సరం సంక్రాంతి బరిలో సోగ్గాడే చిన్ని నాయనా అంటూ వచ్చి ట్రెండ్ సెట్టర్ హిట్ సాధించిన నాగార్జున ప్రస్తుతం చేస్తున్న వంశీ పైడిపల్లి ఊపిరి సినిమా మీద స్పెషల్ ఇంట్రెస్ట్ పెడుతున్నాడట. సినిమా రష్ చూసి సినిమా కచ్చితంగా హిట్ కొడుతుందనే భరోసాతో సినిమా బిజినెస్ గురించి డెఫినెట్ హిట్ అంటూ తన సన్నిహితులకు సలహాలు కూడా ఇస్తున్నాడట.

అంతేకాదు ఈ సినిమా రిలీజ్ విషయంలో కూడా నాగార్జున స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడని టాక్. అందుకే సినిమా సమ్మర్ లో రిలీజ్ చేయాల్సింది మార్చ్ 25న వచ్చేలా ప్లాన్ చేస్తున్నాడట. అయితే ఇదే విషయంలో నాగ్, కార్తిల మధ్య కొంతకాలం చర్చలు జరిగినా చివరకు నాగార్జున మాటే చెల్లింది. మార్చ్ నెల ఆఖరు ఊపిరి రిలీజ్ అవుతుంది. నాగ్ ఫైనల్ గా ఆ డేట్ ను లాక్ చేశాడు. చేస్తున్న సినిమా మీద నమ్మకం ఉంచి దాని మీద హార్డ్ వర్క్ చేస్తే అది కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అని రీసెంట్ గా తన సినిమా ద్వారానే చూపించారని నమ్ముతున్నాడు నాగార్జున. మరి నాగ్ స్పెషల్ ఇంట్రెస్ట్ ఊపిరి సినిమా మీద క్రేజ్ తీసుకువచ్చినా సినిమా సూపర్ హిట్ అవ్వాలంటే కథలో దమ్ము, దర్శక నిర్మాతల కృషి చాలా అవసరం.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close