స‌ర్‌ప్రైజింగ్‌: చ‌ర‌ణ్ సినిమాకి ‘నో’ చెప్పిన నారాయ‌ణ‌మూర్తి

ఆర్‌.నారాయ‌ణ‌మూర్తిది డిఫ‌రెంట్ పంధా. ద‌ర్శ‌కుడిగా, న‌టుడిగా, నిర్మాత‌గా అన్నింటికంటే ముఖ్యంగా వ్య‌క్తిగా ముందు నుంచీ ఆయ‌న స్టైల్ పూర్తిగా విభిన్నం. డ‌బ్బు యావ లేని మ‌నిషి. గ‌తంలో ‘టెంప‌ర్‌’ సినిమా కోసం ఓ కీల‌క‌మైన పాత్ర కోసం నారాయ‌ణ‌మూర్తిని సంప్ర‌దిస్తే సున్నితంగా ‘నో’ చెప్పారు. ఇప్పుడు రామ్ చ‌ర‌ణ్ సినిమా విష‌యంలోనూ ఇదే జ‌రిగింది.

రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా బుచ్చిబాబు ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా తెర‌కెక్క‌నుంది. ఇందులో ఓ కీల‌క‌మైన పాత్ర‌కు నారాయ‌ణ‌మూర్తి అయితే బాగుంటుంద‌ని టీమ్ భావించింది. మైత్రీ మూవీస్‌, చ‌ర‌ణ్ సినిమా.. నారాయ‌ణ‌మూర్తి ‘నో’ ఎందుకు చెప్తారు? కానీ.. మూర్తి మాత్రం సింపుల్ గా ‘సారీ’ చెప్పేసిన‌ట్టు తెలుస్తోంది. ఎన్నిర‌కాలుగా ప్ర‌య‌త్నించినా నారాయ‌ణ‌మూర్తి ఈ సినిమాలో న‌టించ‌డానికి అంగీక‌రించ‌లేద‌ని టాక్‌. దాంతో… చిత్ర‌బృందం ఈ స్థానంలో మ‌రో న‌టుడ్ని ఎంచుకొనే ప‌నిలో ప‌డింది. ఇదో స్పోర్ట్స్ డ్రామా. ఇందులో క‌థానాయిక‌గా జాన్వీ క‌పూర్ ఎంపిక దాదాపుగా ఖాయ‌మైంది. ఓ పాత్ర కోసం క‌న్న‌డ స్టార్ శివ‌రాజ్ కుమార్‌ని తీసుకొన్నారు. మ‌రికొన్ని ముఖ్య‌మైన పాత్ర‌ల్లో ప్ర‌ముఖ న‌టీన‌టుల ఎంపిక కోసం క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close