పవిత్ర లోకేష్ హోమ్లీ ఇమేజ్ డ్యామేజ్

సీనియర్‌ నటుడు నరేశ్‌ – పవిత్ర లోకేష్- రమ్య రఘుపతి వివాదం మరింత ముదిరింది. తాజాగా రమ్య .. నరేష్- పవిత్ర లోకేష్ ని మీడియాకి పట్టించడం సంచలనంగా మారింది. మైసూర్‌లోని ఓ హోటల్‌లో నరేశ్‌-పవిత్రా లోకేశ్‌ కలిసి వున్నారనే సమాచారం తెలుసుకున్న రమ్య అక్కడికి మీడియాని వెంటబెట్టుకొని వెళ్ళింది. తనకు విడాకులివ్వకుండా మరో మహిళని ఎలా పెళ్లి చేసుకుంటారంటూ గొడవ చేసింది. పవిత్రను ఏకంగా చెప్పుతో కొట్టేందుకు రమ్య యత్నించగా.. చుట్టుపక్కల ఉన్నవారు అడ్డుకున్నారు. ఈ గొడవ జరుగుతుండగానే నరేశ్‌, పవిత్ర అక్కడి నుంచి వెళ్లిపోయారు.

నరేశ్‌, ఆయన మూడో భార్య రమ్య రఘుపతి గత కొంతకాలంగా విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలోనే ఆయన పవిత్రా లోకేశ్‌తో సన్నిహితంగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆ వార్తలు రుజువు చేస్తూ రమ్య వారిద్దరి ఒక హోటల్ గదిలో వుండగా మీడియాకి పట్టించడం సంచలనంగా మారింది. నరేష్, రమ్యని వదిలేశాని అంటున్నారు. రమ్య మాత్రం తాను నరేష్ తో ఉంటానని చెబుతున్నారు. మధ్యలో పవిత్ర లోకేష్ కూడా రావడం, ఆమె సినీ స్టార్ కావడం ఈ వివాదం మీడియాకి అత్యంత హాట్ టాపిక్ అయిపొయింది.

పవిత్ర లోకేష్ కన్నడ మాజీ హీరోయిన్. కన్నడ నటుడు మైసూర్ లోకేష్ కుమార్తెగా ఆమె సినిమాలకు పరిచయం అయ్యారు. ఐతే హీరోయిన్ గా పెద్దగా రాణించలేదు. తర్వాత టీవీకి షిఫ్ట్ అయ్యారు. కొన్ని సీరియల్స్ చేశారు. వైవాహిక జీవితం ఆమెకు కలసి రాలేదు. విడాకుల తర్వాత ఆమె నటుడు సుచీంద్ర ప్రసాద్ తో కొన్నాళ్ళు రిలేషన్ షిప్ లో వున్నారని చెబుతుంటారు. అయితే అది కూడా కొద్దిరోజులే.

రెండో ఇన్నింగ్స్ లో తెలుగు చిత్ర పరిశ్రమ పవిత్రని చక్కగా ఆదరించింది. ఆమె స్టార్ మదర్ గా రాణించారు. పెద్ద సినిమాల్లో దాదాపు తల్లి పాత్రలు ఆమెకు దక్కాయి. ఆమెకు మంచి హోమ్లీ ఇమేజ్ వచ్చింది. అయితే ఇప్పుడా వివాదం ఆమె ఇమేజ్ మీద దెబ్బకొట్టింది. ఇదంతా కుటుంబ వ్యవహారం, వ్యక్తిగతం. ఐతే మీడియాలో ప్రాజెక్ట్ అయిన తీరు మాత్రం చాలా దారుణంగా వుంది. ప్రముఖ ఛానల్స్ కూడా ”హోటల్ గదిలో అడ్డంగా దొరికిపోయిన నరేష్ – పవిత్ర” అని హెడ్ లైన్స్ రన్ చేస్తున్నాయి. ఒక సెలబ్రిటీకి ఇంతకంటే దారుణమైన డ్యామేజీ మరొకటి వుండదు. ఈ వివాదం ఎక్కడితో ఆగుతుందో చూడాలి మరి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బీజేపీకి రాజాసింగ్ షాక్…ఏం జరిగిందంటే..?

హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత నామినేషన్ కు ఎమ్మెల్యే రాజాసింగ్ డుమ్మా కొట్టారు.హైదరాబాద్ సెగ్మెంట్ ఇంచార్జ్ గా తన అభిప్రాయాన్ని తీసుకోకుండానే ఏకపక్షంగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని ఫిక్స్ చేశారని రాజాసింగ్ అసంతృప్తిగా...

తెలంగాణలో ఛాలెంజింగ్ పాలిటిక్స్

లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రజాభిప్రాయం ఎలా ఉన్నా మెజార్టీ సీట్లు మావంటే మావేనని ప్రకటిస్తున్నాయి. ప్రత్యర్ధి పార్టీలపై ఆయా పార్టీల నేతలు విమర్శలు, ప్రతి విమర్శలు...

కొనసాగింపు కథల బాక్సాఫీసు వేట

‘బాహుబలి’ సినిమా సైజ్ ని పెంచింది. ప్రేక్షకులందరికీ థియేటర్స్ లోకి తీసుకురాగలిగితే బాక్సాఫీసు వద్ద ఎలాంటి మాయ చేయొచ్చు నిరూపించింది. సినిమా కథకు కూడా కొత్త ఈక్వేషన్ ఇచ్చింది. బహుబలికి ముందు దాదాపు...

ట్రబుల్ షూటర్… ట్రబుల్ మేకర్ అవుతున్నారా?

14... ఇది లోక్ సభ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్. అందుకు తగ్గట్టుగానే ప్రచారం చేపడుతున్నారు. అభ్యర్థుల గెలుపు బాధ్యతను తనే తీసుకొని రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు.ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close