సచివాలయ ఉద్యోగులకు మరో ఫిట్టింగ్ !

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ఈ నెల కూడా పాత జీతమే వచ్చింది. పెరిగిన జీతం వచ్చే నెల నుంచి వస్తుందేమోనని ఆశ పడుతున్నారు. అయితే ప్రొబేషన్ ఖరారు చేసినా వారి వద్ద నుంచి కోట్లు వసూలు చేయడానికి ప్రభుత్వం స్కెచ్ వేసింది. ఆ డబ్బులు ప్రభుత్వానికి బాకీ ఉన్నారని చెల్లిస్తేనే ప్రొబేషన్ ఖరారు చేస్తామని చెబుతోంది. కానీ అలాంటి బాకీలేమి లేమని గ్రామ, వార్డు సచివాయ ఉద్యోగులు అంటున్నారు.

గత ప్రభుత్వాలు ఎప్పుడో ఇచ్చిన ఇళ్లకు ఇప్పుడు డబ్బులు వసూలు చేయాలనుకుంది ఏపీ ప్రభుత్వం. అందుకు ఓటీఎస్ అనే స్కీమ్ పెట్టింది. వాటిపై రోజువారీ టార్గెట్లు పెట్టి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు బాధ్యతలు ఇచ్చింది. ఈ టార్గెట్లకు తాళ లేక.. వారు చాలా మంది లబ్దిదారుల నుంచి తర్వాత ఇస్తామనో.. మరో ప్రామిసరి నోటో రాయించి.. వారు ఓటీఎస్ కట్టినట్లుగా రికార్డుల్లో నమోదు చేశారు. కానీ వారు చెల్లించలేదు. అలా పేరుకుపోయిన సొమ్ము ఎనభై కోట్లకుపైగానే ఉంది. నిజానికి అది లబ్దిదారులు కట్టింది కాదు… కానీ కట్టినట్లుగా రాశారు. అయితే రికార్డుల్లో కట్టినట్లుగా ఉంది.. ఆ సొమ్ము ఖజానాకు జమ కాలేదు కాబట్టి ఎప్పటి పరిస్థితుల్లో ఇవ్వాల్సిందేనని ప్రభుత్వం చెబుతోంది.

ఆ సొమ్ము ఎవరి వద్ద పెండింగ్‌లో ఉందో.. వారి ప్రొబేషన్లను ప్రభుత్వం నిలిపివేసింది. ఆ డబ్బులు కట్టాలని ఒత్తిడి తెస్తోంది., కొంత మంది ఇలా పెండింగ్ బకాయిలు లక్షల్లో ఉన్నట్లుగా ఉండటంతో చాలా మంది టెన్షన్‌కు గురవుతున్నారు. కట్టకపోయినా కట్టినట్లుగా రికార్డు చేసుకోమని ఒత్తిడి చేసిన పై అధికారులను.. స్థానిక వైసీపీ నేతలను వారు గట్టెక్కించమని వేడుకుంటున్నారు. కానీ వారు పట్టించుకోవడం లేదు.

మరో వైపు ఎవరూ నోరెత్తకుండా కఠిన చర్యలను ప్రభుత్వం తీసుకుంటోంది. నిరసనకు దిగిన వారి ప్రొబేషన్ రద్దు చేస్తామని గతంలో రోడ్డెక్కిన వారి పేర్లను కలెక్టర్లకు పంపింది. దీంతో ఇప్పుడు నోరెత్తలేని పరిస్థితికి మిగతావారు వెళ్లిపోయారు. ప్రభుత్వాన్ని నమ్మిదారుణంగా మోసపోయామని వారు ఆవేదన చెందుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

పాయకరావుపేట రివ్యూ : వంగలపూడి అనితకు కలిసొస్తున్న కాలం !

తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్లలో ఒకరు తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత. ఈ ఐదేళ్లలో టీడీపీ మహిళా నేతలు మానసిక వేధింపులు భయంకరంగా ఎదుర్కొన్నారు. వైసీపీ నేతల బూతులు,...

చైతన్య : ప్రభుత్వం శాశ్వతం.. సీఎం కాదు – ఇంగితం లేదా నాగేశ్వర్ !

ఎంత మేధావులమని చెప్పుకున్నా తాత్కాలిక లాభాలో తాము వ్యతిరేకించే వారిని గట్టిగా వ్యతిరేకించాలన్న కురచబుద్దితో వారి ప్రత్యర్థుల్ని సపోర్టు చేసి నవ్వుల పాలవుతూంటారు. ఆ జాబితాలో చాలా కాలంగా ప్రొ.నాగేశ్వర్ కూడా...

కడపలో సీన్ మార్చేస్తున్న షర్మిల !

షర్మిలతో రాజకీయం అంత తేలిక కాదని ఆమె నిరూపిస్తున్నారు. హోంగ్రౌండ్ లో కడప ఎంపీగా గెలిచేందుకు ఆమె చేస్తున్న రాజకీయ వైసీపీ నేతలకు మైండ్ బ్లాంక్ చేస్తోంది. రెండు రోజుల...
video

‘వీర‌మ‌ల్లు’ టీజ‌ర్‌: లెక్క‌లు స‌రిచేసే రాబిన్ హుడ్‌

https://www.youtube.com/watch?v=4TriF7BfHyI ప‌వ‌న్ క‌ల్యాణ్ - క్రిష్ కాంబినేష‌న్‌లో రూపుదిద్దుకొంటున్న చిత్రం 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు'. ప‌వ‌న్ రాజ‌కీయాలు, ఇత‌ర సినిమాల బిజీ వ‌ల్ల‌... 'వీర‌మ‌ల్లు'కి కావ‌ల్సిన‌న్ని డేట్లు కేటాయించ‌లేక‌పోయాడు. దాంతో ఈ సినిమా పూర్త‌వుతుందా,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close