మరో హారర్ ఎంటర్ టైనర్ లో నయనతార

తన సమకాలిక హీరోయిన్లు అందరూ రేసులో వెనకబడిపోతుంటే… నయనతార మాత్రం యమ స్పీడుగా దూసుకుపోతూనే ఉంది. కధల ఎంపికలో ఆమె తీసుకునే “జాగ్రత్తలు, రిస్కులు” అందుకు కారణాలు. కథ నచ్చితే గర్భవతిగా, పిల్లల తల్లిగా, లేదా చెవిటిదానిగా నటించడానికి సైతం ఆమె ఎంతమాత్రం సంకోచించదు. ఓ బిడ్డకు తల్లిగా నయనతార నటించిన హారర్ ఎంటర్ టైనర్ “మయూరి” ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ చిత్రం కోవలో నయనతారతో మరో చిత్రం రూపొందుతోంది. తెలుగు-తమిళ్ భాషల్లో ఏక కాలంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగులో.. సాయిమణికంఠ క్రియేషన్స్ అధినేత జూలకంటి మధుసూదన్ రెడ్డి సమర్పణలో.. మానస్ రుషి ఎంటర్ ప్రైజస్ పతాకంపై కె. రోహిత్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సజ్జూ భాయ్-రామ్ ప్రసాద్ వి.వి.ఎన్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్. లేడి ఓరియంటెడ్ హారర్ డ్రామా ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి “దాస్ రామస్వామి” దర్సకత్వం వహిస్తున్నారు.

నిర్మాత కె. రోహిత్-సమర్పకులు జూలకంటి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ.. “భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఇంకా పేరు పెట్టని ఈ చిత్రాన్ని తెలుగులో అందించబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే ఈ చిత్రం టైటిల్ మరియు మిగతా వివరాలు ప్రకటించనున్నాం” అన్నారు.

ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: సజ్జూ భాయ్-రామ్ ప్రసాద్ వి.వి.ఎన్, సమర్పణ: జూలకంటి మధుసూదన్ రెడ్డి, నిర్మాత: కె.రోహిత్, కథ-స్క్రీన్ ప్లే-దర్సకత్వం: దాస్ రామస్వామి!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close