మారుతి, వెంకటేష్ లకు తలనొప్పిగా మారిన నయనతార

కోలీవుడ్ లో సూపర్ క్రేజ్ మీదున్న నయనతార టాలీవుడ్ సినిమాలను మాత్రం కాస్త లెక్క చేయట్లేదనే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ సినిమాలకు సైన్ చేయకుండా అక్కడ ఎంత విజృంభించినా ఓకే కాని తెలుగులో ఓ సినిమా కమిట్ అయ్యి ఆ సినిమా షూటింగ్ కు తన వల్ల డిస్ట్రబ్ అయ్యేలా చేస్తుంది నయన్. ప్రస్తుతం సెట్స్ మీదున్న వెంకటేష్ ‘బాబు బంగారం’లో కథానాయికగా నయనతార ఎంపిక జరిగింది. సినిమా ఇప్పటివరకు హీరోయిన్ లేకుండా ఉన్న సీన్స్ అన్ని పూర్తి చేశారట.

అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ లో నయన్ పాల్గొనాల్సి ఉన్నా బాబు బంగారం సినిమాకు టైం కేటాయించే తీరిక లేకుండా పోయింది నయనతారకు. అసలే భలే భలే మగాడివోయ్ సినిమా హిట్ జోష్ లో ఉన్న మారుతి విక్టరీ వెంకటేష్ కు ఎన్నాళ్లనుంచో ఎదురు చూస్తున్న భారీ హిట్ ఇస్తాడనే నమ్ముతున్నారు వెంకీ అభిమానులు. కోలీవుడ్ లో వరుస విజయాలతో కనీసం వేరే సినిమాలకు టైం కూడా కేటాయించని పరిస్థితుల్లో ఉంది నయనతార.

కేవలం తన వల్ల సినిమా ఆగిపోతుంది అన్న విషయాన్ని నయనతార గమనించి సినిమా షూట్ లో పాల్గొంటే బెటర్. లేదంటే సినిమా అనుకున్న టైంకు రిలీజ్ అవడం కష్టం. లక్ష్మి, తులసి లాంటి మంచి విజయాలను అందుకున్న వెంకటేష్, నయనతార పెయిర్ ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొడుతుందా లేదో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close