కేసీఆర్‌కు షాక్..! కొత్త జిల్లాల ఫైల్ వెనక్కి..!

రెండు కొత్త జిల్లాలు, వికారాబాద్ ను చార్మినార్ జోన్ లో కలపడం సాధ్యం కాదని… తెలంగాణ సర్కార్ కు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ సర్కార్ పంపిన ఫైల్ ను వెనక్కి పంపింది. తెలంగాణ మందస్తు ఎన్నికల్లో.. రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయడంతో పాటు చార్మినార్ జోన్ లో వికారాబాద్ ను కలుపుతామని కేసీఆర్ హామీలు ఇచ్చారు. రెండోసారి అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలో భాగంగా రెండు కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు. ఫిబ్రవరిలో నారాయణపూర్, ములుగు జిల్లాలను ప్రకటించారు. కలెక్టర్లు, ఎస్పీలను నియమించారు. ఈ రెండు జిల్లాలను రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చితేనే పరిపూర్ణం అయినట్లు. అలా చేస్తేనే కొత్త జోనల్ వ్యవస్థలో పరిగణనలోకి వస్తాయి.

కొత్త జిల్లాలుగా అమలులోకి రాగానే వీటిని కూడా రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చాలని కోరుతూ కేంద్ర హోం శాఖకు ప్రతిపాదనలు పంపారు. కేంద్ర హోం శాఖ రాష్ట్ర ప్రభుత్వ సవరణ ప్రతిపాదనలను రాష్ట్రపతికి పంపి సవరణ కోరాలి. సవరణ ప్రతిపాదనలు కేంద్రానికి చేరి ఎనిమిది నెలలయింది. ఇప్పుడు.. అలా చేయడం సాధ్యం కాదని ఫైల్ వెనక్కి పంపారు. ఆర్టికల్ 371 కి వ్యతిరేకంగా రాష్ట్రపతి ఉత్తర్వులున్నాయని ప్రభుత్వ ఉపాధ్యాయుల సంఘం కోర్టుకు వెళ్లడంతో కోర్ట్ స్టే విధించింది. ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధ్యం కాదని… జిల్లా పరిషత్తు ఉపాధ్యాయులను, ప్రభుత్యోపాధ్యాయులను ఒకే నిబంధన కిందకు తేవడం కుదరదని ప్రభుత్వ టీచర్లు కోర్టు లో కేసు వేశారు. ఈ కేసు ఉన్నందున… అది తేలే వరకు రాష్ట్ర పతి ఉత్తర్వులు అమలు చేయడం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది.

ముందస్తు ఎన్నికలకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న జోనల్ వ్యవస్థ రద్దు చేస్తూ తెలంగాణా ప్రభుత్వం తీసుకొచ్చిన జోనల్ విధానానికి ఆఘమేఘాల మీద నెల రోజుల్లోనే రాష్ట్రపతి ఆమోదముద్ర పడింది. నిజానికి ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సింది సవరణపైనే. చిన్న, చిన్న సవరణలు వెంట, వెంటనే అయిపోతుంటాయి. కానీ కేంద్రం మాత్రం కొర్రీలు పెడుతోంది. కేంద్రంతో కొద్ది రోజులుగా.. తెలంగాణ సర్కార్ సంబంధాలు అంత గొప్పగా లేవు. ఈ కారణంగానే…. ఆమోద ముద్రపడటం లేదన్న ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కర్ణాటకపై బీజేపీ నజర్..ఏక్ నాథ్ షిండే సంచలన వ్యాఖ్యలు..!!

మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీజేపీయేతర ప్రభుత్వాలను కూల్చుతుందని ప్రచారం జరుగుతోన్న వేళ మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. మహారాష్ట్రలో లాగే కర్ణాటకలోనూ...

వన్స్ మోర్ ‘సుచి లీక్స్’: ఈసారి ధనుష్, జీవీ ప్రకాష్

సినిమా వార్తలని ఫాలో అయ్యేవారికి సుచీ లీక్స్ గురించి పరిచయం అవసరం లేదు. 'సుచీ లీక్స్‌' పేరుతో కోలీవుడ్‌లో దుమారం రేపారు సింగర్‌ సుచిత్ర. అప్పట్లో ఆమె నుంచి వచ్చిన...

పుష్ప ఇంపాక్ట్.. బన్నీ ఫుల్ క్లారిటీ

సినిమా ప్రభావం ఖచ్చితంగా సమాజంపై వుంటుందని కొందరి అభిప్రాయం. సమాజంలో ఉన్నదే సినిమాలో ప్రతిబింబిస్తుందని మరికొందరి మాట. సినిమాని సినిమాగా చుస్తారానినేది ఇంకొందరి వాదన. హీరో అల్లు అర్జున్ కూడా ఇదే అభిప్రాయాన్ని...

తీహార్ జైలుకు బాంబు బెదిరింపు… ఆందోళనలో కవిత అభిమానులు..?

అత్యంత భద్రత నడుమ ఉండే తీహార్ జైలుకు బాంబు బెదిరింపు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. జైలును పేల్చేస్తామంటూ ఆగంతకులు మెయిల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయి పోలీసులకు సమాచారం అందించారు. ఆగంతకుల...

HOT NEWS

css.php
[X] Close
[X] Close