కొత్త వైరస్‌ కాదు ఆ భయమే అసలు డేంజర్..!

తెలుగు రాష్ట్రాల్లోనే కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయి. దేశంలోకి యూకే నుంచి వచ్చిన ఆరుగురిలో వైరస్‌ ఉన్నట్లు తాజాగా తేలింది. ఈ ఆరుగురిలో ముగ్గురు ఏపీ, తెలంగాణ వాళ్లే. యూకే నుంచి రాజమహేంద్రవరం వచ్చిన మహిళకు స్ట్రెయిన్‌ సోకినట్లు పరీక్షల్లో తేలింది. సీసీఎంబీ, ఎన్‌ఐవీ నివేదికల ఆధారంగా స్ట్రెయిన్‌ నిర్ధారణ అయినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. హైదరాబాద్‌లో ఇద్దరికి నిర్ధారణ అయింది. వీరి నుచి ఇంకెవరికైనా సోకినట్లుగా తేలలేదు. ఈ ఆరుగురి తోటి ప్రయాణికులు, కుటుంబసభ్యులును ట్రేసింగ్‌ చేస్తున్నారు. కొత్త రకం వైరస్‌ 70శాతం వేగంగా వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో ప్రపంచదేశాలు అప్రమత్తమయ్యాయి.

ఈ కొత్త రకం వైరస్‌ బయటపడినప్పటికీ దీనిపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. ఇది కూడా కరోనా వైరస్‌ కావడంతో లక్షణాలు, తీవ్రత అన్నీ ఒకేవిధంగా ఉంటాయని ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని నిపుణులు సలహా ఇస్తున్నారు. అయితే.. వేగంగా వ్యాప్తి చెందే గుణం ఉన్నందున జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని ప్రభుత్వం చెబుతోంది. రేపో మాపో.. ప్రజలకు అందుబాటులో ఉండే వ్యాక్సిన్.. కొత్త రకానికి కూడా పని చేస్తుందని కేంద్రం ప్రకటించింది..

కొత్త రకం స్ట్రెయిన్ ప్రభావంపై పెద్దగా చర్చ జరగడం లేదు … కానీ విస్తృత వ్యాప్తి మాత్రమే ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రజల్లో భయాందోళనలు పెరుగుతున్నాయి. ముందుగా వైరస్ ల నుంచి కాపాడుకోవాలంటే.. ప్రజల మానసిక ఆరోగ్యం స్థిరంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. లేని పోని ప్రచారాలు చేస్తే… భయంతోనే ఎక్కువ మంది అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సీఐ అంజూ యాదవ్‌నూ సాగనంపారు !

తిరుపతిలో అత్యంత వివాదాస్పదమైన మహిళా సీఐ అంజూ యాదవ్ ను కూడా ఈసీ సాగనంపింది. పోలింగ్ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ విధుల్లో ఉండకూదని ఆర్థరాత్రే బదిలీ చేస్తూ ఈసీ ఉత్తర్వులు...

అల్లు అర్జున్ టూర్ : నంద్యాల ఎస్పీ, డీఎస్పీ, సీఐలపై ఈసీ చార్జ్‌షీట్

అల్లు అర్జున్ నంద్యాల పర్యటన పోలీసులపై కూడా కేసులు నమోదయ్యేలా చేసింది. అల్లు అర్జున్ నంద్యాల పర్యటనకు పోలీసులు అనుమతి తీసుకోలేదు. మామూలుగా అయితే పెద్దగా మ్యాటర్ కాదు....

వారణాశిలో మోడీ నామినేషన్‌కు చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును వారణాశిలో తన నామినేషన్ కు రావాల్సిందిగా ప్రధాని మోడీ ఆహ్వానించారు. మంగళవారం ప్రధాని మోద ీనామినేషన్ వేయనున్నారు. వారణాశిలో ఎన్నికలు చివరి విడతలో జరగున్నాయి. పదమూడో తేదీన...

మిత్రుడు దంతులూరి కృష్ణ కూడా జగన్‌కు వ్యతిరేకమే !

జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35...

HOT NEWS

css.php
[X] Close
[X] Close