తానా ఎన్నికల్లో నిరంజన్ ప్యానల్ గెలుపు..!

తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా “తానా” అధ్యక్షుడిగా నిరంజన్ శృంగవరపు విజయం సాధించారు. ఆయన ప్యానెల్ తరపున పోటీ చేసిన వారు విజయం సాధించారు. నరేన్ కొడాలి ప్యానల్ పరాజయం పాలైనా చివరి వరకూ గట్టి పోటీ ఇచ్చారు. పోలైన ఓట్లలో శృంగవరపు నిరంజన్‌కు 10,866 ఓట్లు రాగా నరేన్‌ కొడాలికి 9,108 ఓట్లు వచ్చాయి. తానా ఎన్నికలు ఎప్పుడూ లేని విధంగా ఈ సారి అనేక వివాదాల మధ్య జరిగాయి. మొదట్లో ఎన్నికల ప్రక్రియలో దొంగ ఓట్లను చొప్పించినట్లుగా గుర్తించారు. చివరి దశలో ఎన్నికలు వాయిదా వేశారు. తర్వాత ఎన్నికల ప్రక్రియను కొనసాగించారు.

ఈ కారణంగా కొంత ఆలస్యం అయింది. అమెరికాలో తెలుగు వాళ్లు పెద్ద ఎత్తున ఈ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉంటారు. ఎన్నికలు జరిగిన ప్రతీ సారి… ఉత్కంఠభరితమైన పోటీ ఉంటుంది కానీ.. ఈ సారి .. మాత్రం మరింత ప్రత్యేకంగా జరిగాయి. అనేక అరాచకాలు చోటు చేసుకున్నాయి. సీనియర్లు అయిన ముగ్గురు సభ్యులతో ఓ విచారణ కమిటీని నియమించి.. ఎన్నికల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లారు. కీలక స్థానంలో పోటీ చేస్తున్న వారే.. దొంగ ఓట్లను చేర్చినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

తానా ఎన్నికల ప్రక్రియ పూర్తి కావడంతో.. అసోసియేషన్ సభ్యులు కూడా ఊపిరి పీల్చుకున్నారు. ఎప్పుడూ లేని విధంగా రెండు ప్యానళ్లు ప్రచారం చేశాయి. ఒకరిపై ఒకరు ఆరోపణలు గుప్పించుకున్నారు. చివరికి ఓ పనైపోయిందని అనిపించారు. అమెరికాలో ఉండే తెలుగు సంఘాల్లో సుదీర్ఘంగా ఉన్నది తానానే. తెలుగురాష్ట్రాల నుంచి అమెరికా వెళ్లే వారికి ఎన్నో విధాలుగా ఉండగా ఉంటుంది. అక్కడ స్థిరపడిన వారికి కూడా వివిధ సమస్యల్లో సహాయకారిగా ఉంటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

చంద్రముఖి కన్నా ఘోరం… ఆర్ఎస్పీ పై సోషల్ మీడియా ఫైర్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయి తీహార్ జైల్లోనున్న ఎమ్మెల్సీ కవితను కలిసిన బీఆర్ఎస్ నేత ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వస్తున్నాయి. ఢిల్లీ లిక్కర్...

‘విద్య వాసుల అహం’ రివ్యూ: మ‌ళ్లీ పాత పెళ్లి కథే!

తెలుగు ఓటీటీ వేదిక 'ఆహా' ప్రతి వారం ఎదో ఒక కొత్త సినిమా ఉండేలా ప్లాన్ చేస్తుకుంటుంది. ఈ వారం రాహుల్ విజయ్, శివాని రాజశేఖర్ నటించిన 'విద్య వాసుల అహం' ప్రేక్షకులు...

కడప కోర్టు తీర్పు రాజ్యాంగవిరుద్ధంగా ఉందన్న సుప్రీంకోర్టు

వివేకా హత్యపై మాట్లాడవద్దని కడప కోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు మండిపడింది. కడప కోర్టు ఉత్తర్వులు సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని.. వాక్ స్వాతంత్ర్యం, స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని స్పష్టం...

కౌంటింగ్‌లో సహకరించాలన్నట్లుగా ఈసీని బెదిరిస్తున్న సజ్జల !

అయిందేదో అయిపోయింది.. ఇక తప్పు దిద్దుకో అని ఈసీని హెచ్చరించారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఈసీ ఏం తప్పు చేసిందో.. ఎలా దిద్దుకోవాలనుకుంటున్నారో ఆయన పరోక్షంగానే తన మాటలతో సందేశం పంపారు. అదేమిటంటే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close