ఏపీ సర్కార్ కరెంట్ బిజినెస్‌..! సీతారామన్ చెప్పిన సీక్రెట్..!

కేంద్ర ప్రభుత్వం ఏపీ ప్రభుత్వానికి రూ. 2.70 పైసలకే కరెంట్ ఇస్తోంది. కానీ ఏపీ సర్కార్ మాత్రం ప్రజల వద్ద నుంచి రూ. 9 రూపాయలు వస్తోంది. అంటే.. కొనుగోలు.. అమ్మకానికి మధ్య మార్జిన్.. ఆరు రూపాయల 30 పైసల వరకూ ఉంది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బయట పెట్టి.. ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇలా అమ్మితే ప్రజలు ఎలా విద్యుత్ బిల్లులు చెల్లిస్తారని ఆమె ప్రశ్నించారు. నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు ఇప్పుడు.. ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు కారణం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యుత్ రంగం విషయంలో వైసీపీ పగ్గాలు చేపట్టినప్పటి నుండి వివాదాస్పద నిర్ణయాలే చోటు చేసుకుంటున్నాయి. ఓ సారి విద్యుత్ చార్జీలు కూడా పెంచారు.

తెలుగుదేశం పార్టీ హయాంలో చేసుకున్న పవర్ పర్చేజింగ్ అగ్రిమెంట్ల విషయంలో ఏపీ సర్కార్.. చట్టాలు.. కోర్టులు చెప్పినా పట్టించుకోకుండా.. వాటిని రద్దు చేయడానికి ప్రాధాన్యం ఇచ్చింది. అయితే.. ఈ వివాదాల కారణంగా విద్యుత్ రంగంలో సంస్కరణలు దెబ్బతిన్నాయి. విదేశీ పెట్టుబడులపై ప్రభావం చూపింది. ఈ వివాదంపై.. కేంద్రం.. రెండు, మూడు సార్లు ఏపీ సర్కార్‌కు హెచ్చరికలు జారీ చేస్తూ.. లేఖలు కూడా పంపింది. అయితే.. ఏపీ సర్కార్ తీరులో మాత్రం మార్పు రాలేదు. ఇప్పుడు కొత్తగా నిర్మలా సీతారామన్.. కేంద్రం వద్ద.. కొని.. వినియోగదారులకు.. చాలా ఎక్కువ మొత్తానికి అమ్ముతూ.. ప్రజల్ని దోపిడీ చేస్తున్నారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం.. చర్చనీయాంశం అవుతోంది

రెండో విడత మోడీ పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా.. వర్చువల్ ర్యాలీలను మోడీ సర్కార్ నిర్వహిస్తోంది. ఏపీలోనూ ఇలాంటిని నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీలో ప్రసంగించిన నిర్మలా సీతారామన్.. ఏపీకి కేంద్రం ఏమేం చేసిందో వివరించారు. ఏపీలో 47 లక్షల మంది రైతుల అకౌంట్లలో రూ.936.16 కోట్లు వేశామని వెల్లడించారు. మత్స్య సంపద యోజన కింద దేశవ్యాప్తంగా రూ.20 వేల కోట్లు ఇచ్చామని, ఆక్వా, మెరైన్‌ ఫిషింగ్‌కు రూ.11 వేల కోట్లు కేటాయించామని నిర్మలాసీతారామన్‌ చెప్పారు. ఏపీ ప్రభుత్వానికి కోవిడ్‌ ఫైట్‌ కింద రూ.8025 కోట్లు ఇచ్చామని పేర్కొన్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఢిల్లీకి చిరు.. రేపే ప‌ద్మ ప్ర‌దానం

మెగాస్టార్‌ చిరంజీవిని ఇటీవ‌ల ప‌ద్మ విభూష‌ణ్ పుర‌స్కారం వ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పుర‌స్కార ప్ర‌దానోత్స‌వం రేపు ఢిల్లీలో జ‌ర‌గ‌బోతోంది. ఈ సంద‌ర్భంగా చిరు ఢిల్లీ బ‌య‌ల్దేరారు. ఆయ‌న‌తో పాటుగా సురేఖ‌, రామ్...

విదేశాలకు వెళ్తా… కోర్టు అనుమతి కోరిన జగన్

విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టును కోరారు ఏపీ సీఎం జగన్. లండన్ వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని కోరారు. ఈ నెల 17 నుంచి జూన్ 1 మధ్య విదేశాలకు వెళ్లేందుకు...

వైన్స్ బంద్… ఆ ఒక్క షాప్ మాత్రం ఓపెన్

తెలంగాణలో లోక్ సభ ఎన్నికల పోరు తుది అంకానికి చేరుకుంది. మరో మూడు రోజుల్లో ప్రచార పర్వం ముగియనున్న నేపథ్యంలో రాష్ట్రమంతటా మద్యం దుకాణాలు రెండు రోజులపాటు మూతబడనున్నాయి. ఈ నెల 11న...

పోలింగ్ ముగిసిన తర్వాత ఫ్యామిలీతో విదేశాలకు జగన్

పోలింగ్ ముగిసిన వెంటనే విదేశీ పర్యటనకు వెళ్లాలని జగన్ నిర్ణయించుకున్నారు. పదమూడో తేదీన పోలింగ్ ముగుస్తుంది. ఆ తర్వాత లెక్కలు చూసుకుని పదిహేడో తేదీన విమానం ఎక్కాలనుకుంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే...

HOT NEWS

css.php
[X] Close
[X] Close