పబ్లిసిటీ అపేసిన నిర్మాత?

ఈవారం విడుదల కావాల్సిన సినిమా ఒకటి వుంది. ఈ సినిమా మీద అంచనాల సంగతి ఎలా వున్నా హీరోకి ఈ సినిమా విజయం చాలా అవసరం. కానీ ఇలాంటి టైమ్ లో ఏమయిందో తెలియదు, ఇక పబ్లిసిటీ నా వల్ల కాదు అని నిర్మాత చేతులు ఎత్తేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అసలు కొత్తగా ప్రకటనలు కానీ, ఇతరత్రా వ్యవహారాలు కానీ తన వల్ల కాదని నిర్మాత కరాఖండీగా చెప్పేసినట్లు వినిపిస్తోంది.

దీంతో ఏం చేయాలో తెలియక హీరో మనుషులు తలపట్టుకున్నారని తెలుస్తోంది. పెద్ద హీరోలు లేదా కాస్త క్రేజ్ వున్న హీరోల సినిమాలకు పబ్లిసిటీలో సగం వృధానే వుంటుంది. సగం అవసరంమైన పబ్లిసిటీ వుంటుంది. మిగిలిన సగం, నెగిటివిటీ రాకుండా చూసుకోవడానికి ఖర్చు చేసే మొహమాటం పబ్లిసిటీ వుంటుంది. అసలే హీరోకి హిట్ లు లేవు. ఇప్పుడు ఈ సినిమా తేడా కొడితే, నెగిటివ్ పబ్లిసిటీ ఓ రేంజ్ లో వుంటుంది. అలా వుండకుండా వుండాలంటే, పబ్లిసిటీకి కాస్త ఖర్చు చేయాలి.

కానీ ఇక్కడే నిర్మాత చేతులు ఎత్తేసారు. దీంతో అవాక్కు కావడం హీరో మనుషుల వంతయింది. పైగా హీరో కూడా అంతే. సినిమా ఎలా వుంటే అలా వుంటుంది, పాజిటివ్ , నెగిటివ్ తనకు అనవసరం అనే టైపు. దాంతో ఏం చేయాలో తెలియక, ఆ మధ్య హీరో చేసిన ఓ కమర్షియల్ వెంచర్ లో వచ్చిన కాస్త అమౌంట్ వుంటే, దాన్ని పబ్లిసిటీ ఖర్చులకు వాడాలని చూస్తున్నారట. ఏమిటో పాపం, హీరో జనాలకు ఈ బాధలు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close