మీడియా పై ధ్వజమెత్తిన పవన్ కళ్యాణ్

ప్రజాపోరాటయాత్రలో భాగంగా సోమవారం రాత్రి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ మీడియా పై ధ్వజమెత్తారు జనసేనాని పవన్ కళ్యాణ్. మైనింగ్‌ కంపెనీ ‘ఆండ్రూ’ అక్రమాలపై ధ్వజమెత్తుతూ పవన్ కళ్యాణ్ లఫూట్ అని తిట్టడం, దాని మీద మన తెలుగు చానల్లో మెట్లమీద డిబేట్ పెట్టడం జరిగింది. దీనిపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ మీడియా పై ధ్వజమెత్తారు. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఏమన్నారంటే..

‘వేల కోట్లు దోచుకుంటున్న మైనింగ్‌ కంపెనీ ‘ఆండ్రూ’ యజమానిని లఫూట్‌ అని నేను తిడితే డిబేట్లు పెట్టారు. పవన్ కళ్యాణ్ ఇలా సపోర్ట్ అని తిట్టచ్చా తిట్టచ్చా, ఒక నాయకుడు ఇలాంటి మాటలతో తిట్టొచ్చా తిట్టొచ్చా.. అంటూ తెగ డిబేట్ లు పెట్టారు. బాలకృష్ణ.. మోదీ తల్లిని తూలనాడితే డిబేట్లు పెట్టరు. అప్పుడు ఎందుకు మీరు డిబేట్ లు పెట్టలేదు. దెందులూరు ఎమ్మెల్యే మాదిగలను కులంపేరుతో దూషిస్తూ మాదిగ కొడకా అని తి డితే అప్పుడు డిబేట్‌ పెట్టరు. వనజాక్షిని చెప్పుతో కొడితే డిబేట్‌ పెట్టరు. అడ్డగోలుగా రిజర్వ్ ఫారెస్టులో బాక్సైట్ దోచే వాడినిి లఫూట్ అని తిడితే దానికి మాత్రం డిబేట్లు పెడతారా? నా వద్ద వేల కోట్లు లేవు. చానళ్లు లేవు.. నా చానళ్లు, పత్రికలు, ఫేస్‌బుక్‌లు, రేడియోలు.. మీరే..’

త్రివిక్రమ్ జల్సా సినిమాలో ఒక డైలాగ్ రాశారు..” చెప్పిన దాంట్లో అవసరమైన దాన్ని వదిలేసి అనవసరమైన దాన్ని పట్టుకొని వేలాడే వాన్నే గూట్లే అంటారు రా గూట్లే” అని. ప్రస్తుతం తెలుగు మీడియా పరిస్థితి ఇలాగే ఉంది. నిజంగా తెలుగు మీడియా కి బాధ్యత ఉంటే, ఆండ్రూ అనే మైనింగ్ కంపెనీలో అక్రమాలు జరుగుతున్నాయి అన్న ఆరోపణ ఎంతవరకు నిజం అని డిబేట్ పెట్టి ఉండేది. ఆరోపణ నిజమా అబద్దమా అన్నది వేరే విషయం. కనీసం ఆ సమస్యపై ఆ ఆరోపణపై డిబేట్ ఫోకస్ చేయకుండా, పవన్ కళ్యాణ్ మాట్లాడిన మొత్తం లోంచి ఒక పదాన్ని తీసుకొని దాని మీద డిబేట్ లు పెట్టాయి మన తెలుగు చానల్స్. సోషల్ మీడియాలో కూడా ఈ ఛానల్ ల తీరు పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

-జురాన్

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ‘లేడీస్ స్పెష‌ల్’

ముందు నుంచీ... విభిన్న‌మైన దారినే వెళ్తున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. త‌ను ఎంచుకొనే ప్ర‌తీ క‌థా... తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓవ‌ కొత్త జోన‌ర్ ని ప‌రిచ‌యం చేసింది. 'హ‌నుమాన్' తో పాన్ ఇండియా క్రేజ్...

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close