చైతన్య : చెదురుతున్న ఆంధ్రుల జల “కల”..!

కరువు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ మారాలనే ఆంధ్రుల జల “కల” చెదిరిపోతోంది. దశాబ్దాల తరబడి కుంటి నడకన సాగిన ప్రాజెక్ట్… ఓ మూడేళ్లు శరవేగంగా నడిచేసరికి ప్రజల్లో ఓ ఆశ ఏర్పడింది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత … పరిస్థితి చూసి.. అందరూ ఊసూరుమనాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వాలను నమ్ముకుంటే ఏ ప్రాజెక్టూ పూర్తి చేయరన్న నమ్మకాన్ని నిజం చేస్తూ.. పోలవరానికి గండికొట్టే పనిని నేటి ప్రభుత్వం విస్తృతంగా చేస్తోంది.

రెండేళ్లలో రెండు శాతమే పూర్తయిన పోలవరం పనులు..!

పోలవరం ప్రాజెక్ట్ విషయంలో ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో సీఎం జగన్ అసెంబ్లీలో జూన్ 2021 కల్లా… పోలవరం పూర్తి చేసి తీరుతామని ప్రకటించారు. ఆ ప్రకటనలో ఆయన హావభావాలు.. బాడీ లాంగ్వేజ్‌ కూడా.. చేయకపోతే.. అప్పుడు అడగండి.. చూద్దాం అన్నట్లుగా ఉంటుంది. దీంతో ఈ వీడియో ఇప్పుడు.. సోషల్ మీడియాలో వైరల్ అయింది. గతంలో మంత్రి అనిల్.. ర జూన్ 2021కి పోలవరం పూర్తి చేస్తాం… బుల్లెట్ దింపుతాం అంటూ…సినిమా డైలాగులు చెప్పారు. ఇప్పుడు పోలవరంకు జగన్ ఇచ్చిన గడువు పూర్తయింది.కానీ … రెండేళ్లలో రెండు శాతం పనులు కూడా జరగలేదు.

ఇప్పుడు ప్రాజెక్ట్ భవితవ్యంపైనే అనుమానాలు..!

అసలు ప్రాజెక్ట్ భవితవ్యంపైనే అనుమానాలు ప్రారంభమయ్యాయి. రివర్స్ టెండర్లతో వందల కోట్ల ఆదా అంటూ కాంట్రాక్టర్‌ను మార్చేసిన సర్కార్.. రెండేళ్లు తిరగకుండానే రూ. మూడు వేల కోట్ల అదనపు చెల్లింపులకు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు కేంద్రం చేసిన పనులకు డబ్బులివ్వకపోయినా అడగలకేపోతున్నారు. సవరించిన అంచనాలను ఆమోదింప చేసుకోలేని పరిస్థితికి చేరుకున్నారు. చివరికి కొత్తగా పోలవరం నుంచి డెడ్‌స్టోరేజీ నుంచి నీరు ఎత్తిపోతలకు ఆమోదం తెలిపి.. ఓ ఎత్తిపోతలకు మార్చే ప్రయ్తనం చేస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. పోలవరం అంటే ఏపీ జీవనాడిగా ప్రసిద్ధి. అలాంటి ప్రాజెక్ట్ రాజకీయాలకు సమిధగా మారడం ఏపీ ప్రజల్ని ఆవేదనకు గురి చేస్తోంది.

రూ. లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టేసుకున్న తెలంగాణ..! ఏపీ పరిస్థితేంటి..?

పోలవరం ప్రాజెక్ట్ దశాబ్దాల ప్రజల కల. రాయలసీమ ప్రజలకు కరువు లేకుండా చేయగల ఏకైక స్వప్నం. ఈ ప్రాజెక్టును.. రాజకీయ కారణాలతోనో.. ఆర్థిక కారణాలతోనో…నిర్వీర్యం చేసుకుంటే… దాని కంటే… తప్పిదం మరొకటి ఉండదు. కేంద్రం జాతీయ హోదా ఇవ్వకపోయినా.. రూ. లక్ష కోట్ల వరకూ వెచ్చించి.. కాళేశ్వరం వంటిప్రాజెక్టుల్ని.. శరవేగంగా నిర్మించుకుంది తెలంగాణ ప్రభుత్వం. అందుకే.. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఏపీ కన్నా ఎక్కువగా పంటలు సాగవుతున్నాయి. ప్రాజెక్టు విషయంలో సర్కార్.. సరిగ్గా వ్యవహరించకపోతే… ప్రజలకు మిగిలేది కన్నీరే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి’ టీజర్ : అమ్మోరు పూనేసింది

https://youtu.be/CAR8XtEpwhE?si=ZNMm4KXPixfwjlDL విశ్వక్ సేన్ ప్రయాణం వైవిధ్యంగా సాగుతుతోంది. అన్నీ తరహ జోనర్స్ లో సినిమాలు చేస్తున్నారు. ఇప్పటివరకూ డెక్కన్ బేస్డ్ సినిమాలతో అలరించిన ఆయన ఇప్పుడు తొలిసారి కోనసీమ నేపధ్యంలో ఓ యాక్షన్ కథ...

టూ లేట్ -కేసీఆర్ సోషల్ మీడియా ఎంట్రీ !

కేసీఆర్ వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించారు. ఆయన ఆపరేట్ చేయరు కానీ అందులో పోస్ట్ చేసే ప్రతి అంశం ఆయన అభిప్రాయమే అనుకోవచ్చు. ఎక్స్ తో పాటు ఫేస్ ...

కమ్యూనిస్టులను దారికి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి

రెండు కమ్యూనిస్టు పార్టీలను బేషరతుగా మద్దతు ప్రకటించుకునేలా చేసుకున్నారు రేవంత్ రెడ్డి. సీపీఐ అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు పెట్టుకుంది. లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభమైన తర్వాత ఒక్క పార్లమెంట్ సీటు...

43వేల కోట్లతో రోడ్లేశాం కానీ వర్షాలకు కొట్టుకుపోయాయి : జగన్

జగన్మోహన్ రెడ్డి నోటికొచ్చింది చెప్పరు.. రాసుకొచ్చిందే చెబుతారు. రాసిచ్చే వారు ఏమి రాసిచ్చారో.. ఆయన ఏమి చదివారో కానీ.. మేనిఫెస్టోను రిలీజ్ చేసేటప్పుడు రోడ్ల ప్రస్తావన తెచ్చారు. టీడీపీ హయాం కన్నా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close