ఖమ్మం టీఆర్ఎస్‌లో చిచ్చు పెట్టేస్తున్న అజయ్..!

ఖమ్మం జిల్లా టీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలు కార్పొరేషన్ ఎన్నికల పుణ్యమా అని రోడ్డున పడుతున్నాయి. ఖమ్మం అంటే పువ్వాడ అజయ్.. పువ్వాడ అజయ్ అంటే ఖమ్మం అన్నట్లుగా ఏకచ్ఛత్రాధిపత్యం వహిస్తున్నారని ఇతర టీఆర్ఎస్ నేతలు కొంత కాలంగా పార్టీ హైకమాండ్‌కు ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికల్లోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. మంత్రి హోదాలో.. ఖమ్మం కార్పొరేషన్‌ను గెలిపించాల్సిన బాధ్యతను తానే తీసుకున్న అజయ్.. ఇదే అడ్వాంటేజ్‌గా తన అనుచరులందరికీ టిక్కెట్లు ఇచ్చేసుకున్నారు. అంతే కాదు.. ప్రచారం కూడా అంతా తన చుట్టే తిరిగేలా చేసుకుంటున్నారు.

ఏకంగా ఖమ్మం ప్రజలంతా తనను చూసి ఓటేయాలని పిలుపునిస్తున్నారు. అజయ్ దూకుడు చూసి.. టీఆర్ఎస్‌లోని ఇతర నేతలు మండి పడుతున్నారు. తనను చూసి ఓట్లేయమని అడగడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. టీఆర్ఎస్‌లో ఎవరైనా కేసీఆర్‌ను చూపించి ఓట్లు అడగాలని.. కేసీఆర్ కంటే.. పెద్ద నేతగా అజయ్ ఎదిగిపోయారా అని ప్రశ్నిస్తున్నారు. ఖమ్మం టీఆర్ఎస్‌లో గ్రూపులు చాలా ఉన్నాయి. తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, నామా నాగేశ్వరరావు ప్రధాన నేతలుగా ఉన్నారు. వీరంతా బలమైన వర్గాలను మెయిన్‌టెయిన్ చేస్తున్నారు.

అయితే అనూహ్యంగా ప్రభుత్వంలో ప్రాధాన్యం మాత్రం.. అజయ్‌కు ఉంది. అందుకే ఈ ముగ్గురు నేతలు అంటీముట్టనట్లుగా ఉంటున్నారు. ఈ కారణంగా తరచూ వారిపై పార్టీ మార్పు రూమర్స్ వస్తున్నాయి. ఇలా రూమర్స్ వచ్చినప్పుడల్లా కేటీఆర్ కల్పించుకుని ఆయన నేతలతో మాట్లాడుతున్నారు. వారు కూల్ అవుతున్నారు. ఇప్పుడు అజయ్.. ఆ ముగ్గురు నేతలకు కార్పొరేషన్ ఎన్నికల పేరుతో మరింత బీపీ పెంచుతున్నారు. అందుకే ఖమ్మం టీఆర్ఎస్‌లో ఏ క్షణమైనా అగ్నిపర్వతం బద్దలవుతుందని ఆ పార్టీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఔను..బీజేపీతో ఒప్పందం ఉందంటోన్న కేటీఆర్..!?

బీజేపీ - బీఆర్ఎస్ మధ్య లోపాయికారి ఒప్పందం ఉందని కాంగ్రెస్ ఆరోపిస్తోన్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తాము బీజేపీతో కలిసే ఉన్నామనే పరోక్షంగా...

గాజు గ్లాస్ జనసేనకు మాత్రమే !

వైసీపీ నేతల ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఇండిపెండెంట్లుగా తమ వారిని నిలబెట్టి వారికి గాజు గ్లాస్ గుర్తు ఇప్పించుకోవాలని చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలయ్యాయి. గాజుగ్లాస్ గుర్తును జనసేన పార్టీకి రిజర్వ్ చేస్తూ...

ఓటేస్తున్నారా ? : ల్యాండ్ టైటింగ్ యాక్ట్ గురించి తెలుసుకోండి !

ఆంధ్రప్రదేశ్ లో లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఢిల్లీలో ఎవరు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ప్రజల బతుకుల్ని ప్రభావితం చేస్తుంది. గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఏముందిలే...

కొడాలి నాని నామినేషన్ తిరస్కరిస్తారా ?

కొడాలి నాని నామినేషన్ కు ఇంకా అధికారికంగా ఆమోదం లభించలేదు. ప్రభుత్వ భవనాన్ని లీజుకు తీసుకుని.. తీసుకోలేదని అఫిడవిట్ దాఖలు చేయడంతో వివాదాస్పదమయింది. రిటర్నింగ్ అధికారి కొడాలి నాని నియమించుకున్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close